News March 18, 2025
ఇంటి వద్దకే రాములు వారి తలంబ్రాలు: ఆర్టీసీ RM బి.రాజు

భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని అక్కడకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామని RM బి.రాజు తెలిపారు. ఇందుకు గాను ఒక్కొక్క ప్యాకెట్ కు రూ.151 ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News February 25, 2026
సంగారెడ్డి: ‘TG-iPASS ద్వారా వేగంగా అనుమతులు’

పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా TG-iPASS విధానం ద్వారా పారదర్శకంగా, వేగంగా అనుమతులు మంజూరు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల విషయంలో అధికారులు ఖచ్చితత్వంతో వ్యవహరించాలని, నిబంధనల ప్రకారం దరఖాస్తులను తనిఖీ చేసి త్వరగా పరిష్కరించాలని సూచించారు.
News February 25, 2026
150 ఫైటర్ జెట్లను మోహరించిన అమెరికా!

ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై ఆందోళన నేపథ్యంలో అమెరికా భారీ సైనిక మోహరింపు చేపట్టినట్లు సమాచారం. 20 ఏళ్లలో లేని విధంగా యూరప్, పశ్చిమాసియా స్థావరాలకు 150కి పైగా యుద్ధ విమానాలను తరలించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. వీటిలో ఫైటర్ జెట్లు, రీఫ్యూయలింగ్ విమానాలు ఉన్నాయి. అదనంగా USS గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ విమాన వాహక నౌక రంగంలోకి దిగింది. ఇరాన్ ముప్పును అడ్డుకునేందుకే అమెరికా తన బలాన్ని ప్రదర్శిస్తోంది!
News February 25, 2026
మంచిర్యాల: పదో తరగతికి 48 పరీక్షా కేంద్రాలు

మంచిర్యాల జిల్లాలో 48 పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్లో డీఈఓ యాదయ్య, ఇతర విద్యాశాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. 9,703 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.


