News March 18, 2025

ఇంటి వద్దకే రాములు వారి తలంబ్రాలు: ఆర్టీసీ RM బి.రాజు

image

భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని అక్కడకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామని RM బి.రాజు తెలిపారు. ఇందుకు గాను ఒక్కొక్క ప్యాకెట్ కు రూ.151 ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

Similar News

News April 22, 2025

పదేళ్ల పిల్లలకూ సొంతంగా బ్యాంక్ లావాదేవీలకు అనుమతి

image

ప్రస్తుతం మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు తీసుకునే సదుపాయం ఉన్నప్పటికీ ఎవరైనా గార్డియన్‌గా ఉండటం తప్పనిసరి. ఇకపై పదేళ్లు దాటిన పిల్లలు కూడా ఖాతాలను సొంతంగా నిర్వహించుకునేలా RBI మార్గదర్శకాలను విడుదల చేసింది. సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ అకౌంట్లను తెరిచి లావాదేవీలను సాగించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM, చెక్ బుక్ సదుపాయమూ ఉంటుంది. జులై 1 నుంచి ఈ రూల్స్‌ను అమలు చేయాలని బ్యాంకులను RBI ఆదేశించింది.

News April 22, 2025

ములుగు జిల్లాలో దారుణం.. వ్యక్తి హత్య!

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాశ్ ఈ నెల 15న హనుమకొండలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణ చేపట్టగా ఓ కానిస్టేబుల్ సుపారి గ్యాంగ్‌తో కలిసి సాయి ప్రకాశ్‌ను హత్య చేసినట్లు తెలిసింది. మండలంలో ఎంతోమంది గర్భిణులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, ఆదివాసులకు సేవ చేసిన సాయి ప్రకాశ్ మృతితో మండలంలో విషాదం నెలకొంది.

News April 22, 2025

MLA వెంకట్రావు ద్రోహి : MLC కవిత

image

సోమవారం భద్రాచలంలో పర్యటించిన MLC కవిత స్థానిక MLA వెంకట్రావుపై విమర్శలు గుప్పించారు. BRS తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ద్రోహి వెంకట్రావు అని అన్నారు. భద్రాచలం అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తక్కువ స్థానాలోచ్చిన భద్రాచలం గెలుపు రికార్డన్నారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి మూడు పైసలు తీసుకురాలేదన్ని మండిపడ్డారు.

error: Content is protected !!