News August 10, 2024
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా హేమలత

అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గుజ్జుల హేమలత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఆరో తేదీ ఎన్నికలు నిర్వహించగా శుక్రవారం ఫలితాలు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అనంతపురం జిల్లా శాఖ ఆర్థిక కార్యదర్శిగా ఉన్న హేమలతను జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Similar News
News December 9, 2025
అనంత జిల్లాలో యువకుడి దారుణ హత్య

అనంతపురం(D) బుక్కరాయ సముద్రం పంచాయతీ పరిధిలోని వీరభద్ర కాలనీకి చెందిన సాయిచరణ్(23) దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయి చరణ్ స్నేహితులే పొలంలో కొట్టి చంపి, అనంతరం బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 9, 2025
అనంత: పోలీసుల PGRSకు 128 పిటిషన్లు.!

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన PGRSకు ప్రజల నుంచి 128 పిటిషన్లు వచ్చినట్లు జిల్లా SP జగదీశ్ తెలిపారు. ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరానికి సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులు పంపించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
News December 9, 2025
అనంత: పోలీసుల PGRSకు 128 పిటిషన్లు.!

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన PGRSకు ప్రజల నుంచి 128 పిటిషన్లు వచ్చినట్లు జిల్లా SP జగదీశ్ తెలిపారు. ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరానికి సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులు పంపించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.


