News April 25, 2024
ఇండియన్ రైల్వేస్లో సెకండ్ బెస్ట్ లోకో షెడ్గా గుత్తి

ఇండియన్ రైల్వేస్లోని డీజిల్ లోకో షెడ్ నందు త్రీ ఫేజ్ జీ-9 ఎలక్ట్రికల్ ఇంజిన్ల నిర్వహణలో గుత్తి లోకో డీజిల్ షెడ్ సెకండ్ బెస్ట్ డీజిల్ షెడ్గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జై షీల్డ్ బహుకరించారు. గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ రమేష్ షీల్డ్ అందుకున్నారు.
Similar News
News April 23, 2025
కూలీ కుమారుడికి 593 మార్కులు

గుత్తి మోడల్ స్కూల్ విద్యార్థి నరసింహ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 593 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచారు. నరసింహ తండ్రి ఐదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి కళావతి కూలీ పని చేస్తూ కొడుకును చదివిస్తోంది. పేదింటి బిడ్డ మంచి మార్కులతో సత్తా చాటడంతో ఉపాధ్యాయులు, బంధువులు విద్యార్థిని అభినందించారు. తల్లి కళావతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
News April 23, 2025
10th Results: అనంతపురం జిల్లాకు ఈసారి నిరాశే.!

అనంతపురం జిల్లా పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించలేదు. 30,700 మంది విద్యార్థులలో 21,510 మంది ఉత్తీర్ణత సాధించారు. 70.07 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. గతేడాది టెన్త్ ఫలితాల్లో 30,893 మందికి 25,003 మంది పాసయ్యారు. 84.46 శాతంతో పాస్ పర్సంటేజ్తో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 23తో ఒక స్థానం మెరుగైంది.
News April 23, 2025
10th Results: 23వ స్థానంలో అనంతపురం జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 30,700 మంది పరీక్ష రాయగా 21,510 మంది పాసయ్యారు. 15,733 మంది బాలురులో 10,315 మంది, 14,967 మంది బాలికలు పరీక్ష రాయగా 11,195 మంది పాసయ్యారు. 70.07 పాస్ పర్సంటైల్తో అనంతపురం జిల్లా 23వ స్థానంలో నిలిచింది.