News February 27, 2025
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో అతిరుద్ర మహా యజ్ఞానికి చోటు

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఈనెల 14 నుంచి 25 వరకు జరిగిన అతిరుద్ర మహా యజ్ఞం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. దాదాపు 83 దేశాలకు చెందిన శ్రీ సత్యసాయి భక్తులు లక్షలాదిమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా అతిరుద్ర మహా యజ్ఞాన్ని తిలకించారని నిర్వాహకులు తెలిపారు. సత్య సాయి ట్రస్టు సభ్యులకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిన పుస్తకాన్ని నిర్వాహకులు అందజేశారు.
Similar News
News November 25, 2025
పెద్దపల్లిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం

RGM సీపీ ఆదేశాలపై PDPLలోని ఒక కాలేజీలో పెద్దపల్లి షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఇన్ఛార్జ్ SI లావణ్య మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్పై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. వేధింపులపై 6303923700, సైబర్ మోసాలపై 1930, అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలన్నారు. బస్టాండ్, ప్రధాన చౌరస్తాల్లో రెగ్యులర్ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News November 25, 2025
పెండింగ్ దరఖాస్తులు వెంటనే సమర్పించండి: కలెక్టర్

PDPL కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేయని ఎస్సీ విద్యార్థులను గుర్తించి వెంటనే https://telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తులు DEC 31లోపు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల హార్డ్ కాపీలు, బయోమెట్రిక్ అథెంటికేషన్ను పూర్తిచేసి SC అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News November 25, 2025
పెగడపల్లి: 10,853 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

పెగడపల్లి మండలంలో వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మహిళా సంఘాలకు రూ.304 కోట్లు, జగిత్యాలలో 11,825 సంఘాలకు రూ.10.69 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు 10,853 ఇళ్లు మంజూరై అర్హులకు రూ.5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు.


