News February 26, 2026

ఇందల్వాయి: 9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త

image

ఇందల్వాయి మండలం గన్నారంలో 9 నెలల నిండు గర్భిణిని కట్టుకున్న భర్తే గొంతు నులిమి హత్య చేశాడు. డిచ్‌పల్లి సీఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన నాగేశ్ పది సంవత్సరాల క్రితం సుమలత(31)ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనుమానంతో తరచూ నాగేశ్ భార్యతో గొడవ పడేవాడు. ఈ నెల 22న అర్ధరాత్రి భార్యను హత్య చేశాడు.

Similar News

News April 16, 2026

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: ఎస్పీ వకుల్

image

యువతను డ్రగ్స్ రహిత సమాజం వైపు నడిపించడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీస్ శాఖ శ్రీకారం చుట్టిన ‘సంకల్పం’ కార్యక్రమం గురువారం చేబ్రోలులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగింది. గంజాయి, మాదక ద్రవ్యాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తాయని SP వకుల్ జిందాల్ హెచ్చరించారు. ప్రతి విద్యార్థి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని, వ్యసనాల బారిన పడకుండా చదువుపై ఏకాగ్రత వహించాలని పిలుపునిచ్చారు.

News April 16, 2026

నరసన్నపేట: ‘ముద్దాయిలకు న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం’

image

నరసన్నపేట‌లోని స్థానిక సబ్ జైలును జిల్లా న్యాయాధికార సేవా సంస్థ కార్యదర్శి హరిబాబు ఆకస్మికంగా పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం సబ్ జైలుకు చేరుకున్న ఆయన ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..బెయిల్ కోసం ప్రయత్నం చేసే ముద్దాయిలకు న్యాయాధికారి సేవా సంస్థ తరఫున ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ వినయ్ కుమార్ ఉన్నారు.

News April 16, 2026

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: కలెక్టర్

image

కలెక్టర్ పి. రాజాబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. విద్యా ప్రమాణాల పెంపునకు FLN బలోపేతం చేయాలని, PAL ల్యాబ్ ట్యాబ్స్ వినియోగం, క్రమం తప్పకుండా స్లిప్ టెస్టులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు పోషకాహారం, ప్రోటీన్ సప్లిమెంట్లు అందించాలని ఆదేశించారు.