News March 16, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నాణ్యతగా ఉండాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నాణ్యతగా ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. పటాన్ చెరు మండలం రామేశ్వరం మండలం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను శనివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా శిక్షణ పొందిన మహిళా మేస్త్రిలు ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చలపతి, తహశీల్దార్ రంగారావు పాల్గొన్నారు.
Similar News
News March 16, 2025
రేపు క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని అమరావతిలో సీఆర్డీఏ చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. ఇంకా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
News March 16, 2025
సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ సీపీ

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు హెలికాప్టర్లో సభాస్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పాగుచ్ఛాన్ని సీఎంకు సీపీ అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ ముఖ్యమంత్రితో సభాస్థలికి చేరుకున్నారు.
News March 16, 2025
విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చేప్పిన పల్నాడు కలెక్టర్

జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులందరూ ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు కోరారు. జిల్లాలో 463 పాఠశాల నుంచి మొత్తం 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. జిల్లాలో 128 పరీక్ష కేంద్రాలలో బాలురు 13,415 మంది బాలికలు 1,382 మంది ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. జిల్లాలోని విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.