News March 19, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలి: వనపర్తి కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులందరూ ఈ నెలాఖరులోపు ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో వెబ్ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఎంపికైన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు.

Similar News

News December 22, 2025

ఖమ్మం: 290 మంది కుష్టు వ్యాధి అనుమానితుల గుర్తింపు

image

ఖమ్మం జిల్లాలో కుష్టు నిర్మూలనే లక్ష్యంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ నెల 18 నుంచి 1,339 మంది ఆశా కార్యకర్తలు 50 వేల ఇళ్లను సందర్శించి 1.61లక్షల మందిని పరీక్షించారు. ఇప్పటివరకు 290 మంది అనుమానితులను గుర్తించినట్లు DMHO డాక్టర్ రామారావు తెలిపారు. వీరికి తుది పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు.. లక్షణాలుంటే భయం వీడి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

News December 22, 2025

సూర్యాపేట, యాదాద్రిలోనూ డీసీసీబీ..!

image

జిల్లాలోని సహకార వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు కొనసాగుతున్నది. అయితే జిల్లాకో డీసీసీబీ ఏర్పాటుకు సన్నాహాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో మాత్రమే డీసీసీబీ బ్యాంకు ఉన్నది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలోనూ డీసీసీబీలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది.

News December 22, 2025

NLG: పాత బాకీలు కోట్లలోనే.. ముందుకు సాగేది ఎట్లా?

image

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జీపీలకు సుమారు రూ.140 కోట్లపైనే అప్పు ఉంది. ఇలాంటి నేపథ్యంలో కొత్త సర్పంచ్లకు అభివృద్ధి అనేది సవాల్‌గా మారనుంది. సీసీ రోడ్లు, డ్రైనేజీల వంటి అభివృద్ధి పనులకు నోచుకోకపోవడంతో పాటు పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, కరెంటు బిల్లులు, తరచుగా వచ్చే మోటార్ల మరమ్మతులు, ట్రాక్టర్ల నిర్వహణ ఖర్చులు నూతన పాలక వర్గాలకు ఆర్థికంగా పెనుభారంగా పరిణమించబోతోంది.