News December 10, 2024
ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు సహకరించాలి:కలెక్టర్
ఖమ్మం:ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొని సరైన సమాచారం అందించి అధికారులకు సహకరించాలని సోమవారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి మొబైల్ యాప్లో నమోదు చేయడానికి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
Similar News
News January 15, 2025
KMM: మేకపోతులు కొనేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలైన ఘటన పెనుబల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పార్థసారథిపురం గ్రామానికి చెందిన కీసర రాజు, కుంజా మహేశ్ కనుమ కావడంతో బైక్పై మేకపోతులు కొనేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. మహేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 15, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యాటన ∆} అమ్మపేటలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
News January 15, 2025
ఖమ్మం ఖిల్లాపై రోప్ వే.. హిస్టరీ ఇదే
ఖమ్మం ఖిల్లాపై రూ.30కోట్లతో ప్రభుత్వం రోప్ వే నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఖిల్లాలో ఉన్న జాఫర్ బావికి సైతం పునరుద్ధరణ పనులు చేస్తోంది. అయితే ఈ ఖిల్లాకు చారిత్రక నేపథ్యం ఉంది. మొదట దీని పేరు ఖమ్మంమెట్టు కాగా క్రీ.శ 950లో నిర్మాణానికి పునాదులు పడ్డాయి. 400 ఏళ్లపాటు కాకతీయులు, 300 ఏళ్లపాటు రెడ్డి రాజుల అధీనంలో ఉండగా అనంతరం కుతుబ్ షాహీ వంశస్థులు కోటను మెరుగుపరిచి ఖమ్మం ఖిల్లాగా పేరు మార్చారు.