News November 15, 2024
ఇంద్రవెల్లి: ఎక్సైజ్ కానిస్టేబుల్.. జూనియర్ అసిస్టెంట్గా ఎంపిక

ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంటకి చెందిన శ్యామ్ రావ్, రేఖ బస్సి దంపతుల కుమార్తె ప్రీతి గ్రూప్ -4 ఫలితాల్లో కొలువు సాధించింది. ఇది వరకే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జాయిన్ అయింది. గ్రూప్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో సెలవు పెట్టి ఉద్యోగానికి సన్నద్ధమైంది. ఎట్టకేలకు గ్రూప్ -4 రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఎంపికైంది. దీంతో బంధుమిత్రులు అభినందించారు.
Similar News
News December 3, 2025
విజయ్ మర్చెంట్ ట్రోఫీకి ADB క్రికెటర్ ఎంపిక

ADB జిల్లాకు చెందిన యువ క్రికెటర్ కశ్యప్ పటాస్కర్ ప్రతిష్టాత్మక విజయ్ మర్చెంట్ ట్రోఫీ (అండర్–16) కి వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్ణాటకలోని శివమొగ్గలో జరగనుంది. విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక కావడం పట్ల శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు కశ్యప్కు అభినందనలు తెలిపారు.
News December 3, 2025
విజయ్ మర్చెంట్ ట్రోఫీకి ADB క్రికెటర్ ఎంపిక

ADB జిల్లాకు చెందిన యువ క్రికెటర్ కశ్యప్ పటాస్కర్ ప్రతిష్టాత్మక విజయ్ మర్చెంట్ ట్రోఫీ (అండర్–16) కి వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్ణాటకలోని శివమొగ్గలో జరగనుంది. విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక కావడం పట్ల శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు కశ్యప్కు అభినందనలు తెలిపారు.
News December 3, 2025
ADB: సీఎం రేవంత్ పర్యటనపైన ప్రగతి ఆశలు

సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సీఎం పర్యటనతో జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. బాసర ఆలయం, కుంటాల జలపాతం, జైనథ్ టెంపుల్ అభివృద్ధిపై వరాల జల్లు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు, సమస్యలపై సీఎం స్పందిస్తే మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇలా జిల్లాకి ఇంకేం కావాలో కామెంట్ చేయండి.


