News February 21, 2025

ఇంద్రవెల్లి: నాలుగు వైన్స్‌ల్లో చోరీ

image

ఇంద్రవెల్లి ఏజెన్సీ ప్రాంతంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం రోజుల క్రితం నార్నూరులోని వ్యాపారి ఇంట్లో, వైన్ షాపులో చోరీ జరగింది. అది మరవకముందే గురువారం రాత్రి ఉట్నూర్ ఎక్స్ రోడ్, లోకారి, ఈశ్వర్ నగర్ వైన్ షాపుల్లో దొంగతనం జరిగింది. శుక్రవారం ఉదయం వైన్ షాపు యజమానులు చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలపడంతో పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు.

Similar News

News February 23, 2025

సోమవారం ప్రజావాణి రద్దు: ADB కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వచ్చే సోమవారం 24వ తేదిన ప్రజావాణి రద్దు చేసినట్లు ADB జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల, ఉపాద్యాయ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు నిర్వహించడం, ఎన్నికలపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్‌కు రాకూడదని సూచించారు.

News February 22, 2025

ADB: బాలికపై అత్యాచారం.. ముగ్గురి అరెస్ట్: SP

image

తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని ADB ఇన్‌ఛార్జ్ SP జానకి షర్మిల అన్నారు. బాలికపై << 15538444>>అత్యాచార <<>>ఘటనలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితులు అనిల్, గంగాధర్, సుష్మలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి సందేహం లేకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 22, 2025

ADB: చంపుతున్నాయ్.. తింటున్నాయ్

image

ఉమ్మడి ADBజిల్లాను పెద్దపులి, చిరుత హడలెత్తిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి బయటకి వచ్చి జంతువులపై దాడి చేసి చంపేసి తినేసి వెళ్తున్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో గేదెను పెద్దపులి చంపగా.. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్‌లో చిరుత గొర్రెపిల్లపై దాడి చేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ADB జిల్లా తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల్లో చిరుత రైతులను పనులు చేసుకోనీయడం లేదు.

error: Content is protected !!