News January 24, 2025

ఇంద్రవెల్లి: ‘పాదరక్షలతో వస్తే రూ.5 వేల జరిమానా’

image

పుష్య మాసం అంటే ఆదివాసీ గిరిజనులకు పవిత్ర మాసం. ఈ మాసంలో నెల రోజుల పాటు ఆదివాసీ గిరిజన గోండులు, కొలాం గిరిజనులు పాదరక్షలు ధరించరు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడ గ్రామ గిరిజనులు తమ గూడెంలోకి ఈ మాసంలో పాదరక్షలు ధరించి రావొద్దని ఏకంగా చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. గూడెం వాసులు, బయట వారు కానీ పాదరక్షలతో వస్తే వారికి రూ. 5 వేలు జరిమానా విధించటానికి గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించారు.

Similar News

News December 2, 2025

హనుమద్వ్రతం ఎందుకు చేయాలి?

image

హనుమద్వ్రత ఫలితం కార్యసాధనకు తోడ్పడుతుందని, పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తుందని పండితులు చెబుతున్నారు. ‘స్వామిని మనసారా స్మరిస్తే ధైర్యం చేకూరి కార్యోన్ముఖులు అవుతారు. సకల భయాలూ నశిస్తాయి. గ్రహ పీడలు, పిశాచ బాధలు దరిచేరవు. మానసిక వ్యాధులు తొలగిపోయి, మనసులో ప్రశాంతత, సానుకూలత నెలకొంటాయి. ఇది విజయాన్ని, శాంతిని, రక్షణను ఏకకాలంలో ప్రసాదించే శక్తివంతమైన వ్రతం’ అని అంటున్నారు. జై హనుమాన్!

News December 2, 2025

ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

image

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.

News December 2, 2025

రాజీనామా వెనక్కి తీసుకున్న జకియా ఖానం!

image

AP: శాసనమండలి అభ్యర్థిత్వానికి రాజీనామా చేసిన ఆరుగురు MLCలను ఛైర్మన్ మోషేన్ రాజు నిన్న పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా జకియా ఖానం తన రాజీనామా వెనక్కి తీసుకున్నారు. పదవీకాలం 7నెలలే మిగిలి ఉందని, ఎన్నిక నిర్వహించడానికి టైం ఉండదని ఛైర్మన్ చెప్పడంతో రాజీనామా ఉపసంహరించుకున్నారు. మిగతా MLCలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, సునీత, జయమంగళ, మర్రి రాజశేఖర్‌లు తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.