News January 24, 2025
ఇంద్రవెల్లి: ‘పాదరక్షలతో వస్తే రూ.5 వేల జరిమానా’

పుష్య మాసం అంటే ఆదివాసీ గిరిజనులకు పవిత్ర మాసం. ఈ మాసంలో నెల రోజుల పాటు ఆదివాసీ గిరిజన గోండులు, కొలాం గిరిజనులు పాదరక్షలు ధరించరు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడ గ్రామ గిరిజనులు తమ గూడెంలోకి ఈ మాసంలో పాదరక్షలు ధరించి రావొద్దని ఏకంగా చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. గూడెం వాసులు, బయట వారు కానీ పాదరక్షలతో వస్తే వారికి రూ. 5 వేలు జరిమానా విధించటానికి గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించారు.
Similar News
News February 14, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

>పాలకుర్తిలో 32 కిలోల గంజాయి పట్టివేత >ఈనెల 16వ తేదీ నుండి 28 వరకు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నాం: కలెక్టర్ >షమీం అత్తర్ కమిటీ పత్రాలను దగ్ధం చేసిన మాల మహానాడు నేతలు >బీఆర్ఎస్ నేతలకు వింత జబ్బు సోకింది: కడియం >ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలి కలెక్టర్ > అక్రమ ఇసుక రవాణా జరగడానికి వీలు లేదు ఏసిపి > తాడిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి గాయాలు > ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షకు 89 మంది గైర్హాజరు
News February 14, 2025
MDK: పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి: కలెక్టర్

పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయా సంబంధించిన వివిధ దశలలో ఉన్న పనులను వాటి పురోగతిని సమీక్షించి సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ఆదేశించారు.
News February 14, 2025
స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం

AP: స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్రలో భాగంగా 14 సూచికల ఆధారంగా జిల్లాలకు ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, డోర్ టు డోర్ వేస్ట్ కలక్షన్స్, సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్, క్లీన్ విలేజ్, సహా పలు అంశాలకు పాయింట్లు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. 200 పాయింట్లకు 129 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో, 81 పాయింట్లతో అల్లూరి జిల్లా 26వ స్థానంలో నిలిచాయి.