News April 10, 2025
ఇంద్రవెల్లి: భర్తపై ప్రియుడితో కలిసి గొడ్డలితో దాడి

భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసిన ఘటన ఇంద్రవెల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గోపాల్పూర్ వాసులు సాహెబ్ రావ్, ఎల్లవ్వ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. 4నెలల క్రితం సాహెబ్ రావ్ చిన్నమ్మ కోడుకు దశరథ్ వారి ఇంటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. సాహెబ్ పనినిమిత్తం వేరే ఊరికి వెళ్లడంతో ఎల్లవ్వ, దశరథ్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త మందలించడంతో అతడిని చంపేందుకు యత్నించారు.
Similar News
News April 21, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా..

పార్వతీపురం జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDM తెలిపింది. ఉదయం 10 తర్వాత బయటికొచ్చే వారంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బలిజిపేట, గరుగుబిల్లి, సీతానగరం మండలాల్లో 43.7°C, కొమరాడ, పార్వతీపురం మండలాల్లో 43.4°C నమోదవుతాయని తెలిపింది. మిగిలిన అన్ని మండలాల్లో 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News April 21, 2025
జర్మన్ యువకుడిని పెళ్లాడిన మంగళగిరి యువతి

మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన మౌనిక జర్మనీలో PHD చేస్తూ ఉద్యోగం చేస్తుంది. అక్కడే పనిచేస్తున్న జర్మన్ యువకుడు ఫాబియన్ డువెన్ బేక్తో పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో వీరి వివాహం ఆదివారం పెదవడ్లపూడిలో ఘనంగా జరిగింది. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ దంపతులు వధూవరులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
News April 21, 2025
శ్రీకాకుళం: నేడు ఈ మండలాల్లో రెడ్ అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలో నేడు ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బూర్జ 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత , హిరమండలం 41.4, ఎల్ ఎన్ పేట 41.3, పాతపట్నం 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.