News January 31, 2025

ఇంద్రవెల్లి: శాంతియుతంగా కొనసాగిన ప్రజాదర్బార్

image

ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర నేపథ్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రజాదర్బార్ శుక్రవారం శాంతియుత వాతావరణంలో జరిగింది. ఈ సందర్బంగా ప్రజావాణిలో ప్రజల సమస్యల దరఖాస్తులను స్వీకరించగా వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి జిల్లా MLC, MLAలు, కాంగ్రెస్ ముఖ్యనాయకులు హాజరయ్యారు. కార్యక్రమానికి ఆదివాసీ పెద్దలు, మహిళలు, ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు.

Similar News

News December 9, 2025

ఆదిలాబాద్: ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావా’

image

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడతలో 166 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఎన్నికలకు మరో ఒక్క రోజే గడువు ఉండడంతో అందుబాటులో లేని స్థానిక ఓటర్లకు అభ్యర్థులు పదేపదే కాల్స్ చేస్తున్నారు. చాలా మంది రాజధాని పరిధిలోని HYD,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లారు. వారికి కాల్ చేసి ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావ్ కదా.. నాకే ఓటేయాలి’ అంటూ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నారని సమాచారం.

News December 9, 2025

ఆదిలాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు మండలాల్లోని 166 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

News December 8, 2025

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు: ADB కలెక్టర్

image

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ జెడ్పి సమావేశ మందిరంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల స్టేజ్- 2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ పూర్తి చేసి ఫలితాలు T -పోల్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.