News June 22, 2024
ఇకపై అయ్యన్న హుందాతనం చూస్తారు: పవన్ కళ్యాణ్

అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో <<13488653>>అయ్యన్నపాత్రుడు<<>> ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25వ యేటనే రాజకీయాల్లోకి వచ్చి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తనదైన ముద్రవేశారన్నారు. ఐదేళ్లలో ఆయనపై అనేక కేసులు పెట్టినా నిలబడ్డారన్నారు. అటు ఇన్ని దశాబ్దాల్లో అయ్యన్న వాడివేడి, వాగ్దాటిని చూసిన ప్రజలు ఇక ఆయన హుందాతనం చూస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్గా రావడం సంతోషకరమన్నారు.
Similar News
News October 28, 2025
రేపు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెలవు

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బుధవారం కూడా సెలవు ప్రకటిస్తూ ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు 2 రోజులుగా తరగతులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తుఫాను నేపథ్యంలో ఉద్యోగులకు, సిబ్బందికి సైతం మంగళవారం సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో పాఠశాలలకు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు కూడా సెలవు ప్రకటించారు.
News October 28, 2025
మరింత అప్రమత్తంగా ఉందాం: ప్రత్యేక అధికారి

మొంథా తుపాను మంగళవారం రాత్రి 10 నుంచి సుమారు 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేక అధికారి అజయ్ జైన్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు చేపట్టే ముందస్తు జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎంపీ శ్రీభరత్, తదితరులు పాల్గొన్నారు.
News October 28, 2025
జాతీయ రహదారిపై భారీ వాహనాల నిలిపివేత: విశాఖ సీపీ

మొంథా తుఫాను నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీ వాహనాలను మంగళవారం రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. భారీ గాలులు, వర్షం కురిసే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అవసరమైతే తప్ప ప్రయాణం చేయొద్దని ఆయన సూచించారు. ప్రజలు, వాహనదారుల సహకరించాలని కోరారు.


