News February 11, 2025

ఇకపై ఆ రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం

image

విజయవాడ- సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లను(నం.12713& 12714) మోడరన్ లింక్డ్ హాఫ్‌మన్ బుష్(LHB) కోచ్‌లతో నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నేడు సోమవారం నుంచి LHB కోచ్‌లతో నడిచే విధంగా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఈ రైలును అభివృద్ధి చేశామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

Similar News

News October 21, 2025

పేరుపాలెం బీచ్ సందర్శకులకు అనుమతి లేదు: ఎస్ఐ

image

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున బుధవారం పేరుపాలెం బీచ్‌లోకి సందర్శకులను అనుమతించడం లేదని మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

News October 21, 2025

సంగారెడ్డి: ’41 మంది ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులైరజేషన్’

image

జిల్లాలోని వివిధ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న 41 మంది ఉపాధ్యాయుల సర్వీస్‌ను రెగ్యులరైజేషన్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. డీఎస్సీ ద్వారా 2019, 2020 సంవత్సరంలో నూతనంగా నియామకం అయిన ఉపాధ్యాయుల సర్వీస్‌ను రెగ్యులరైజేషన్ చేసినట్లు పేర్కొన్నారు.

News October 21, 2025

రేపట్నుంచి UAEలో చంద్రబాబు పర్యటన

image

AP: పెట్టుబడుల సాధన కోసం CM CBN రేపట్నుంచి 3 రోజుల పాటు UAEలో పర్యటించనున్నారు. తొలుత దుబాయ్‌లో CII నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. శోభా, లోధా, షరాఫ్ డీజీ గ్రూపులు, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థల అధిపతులతో భేటీ అవుతారు. 24న AP NRT చేపట్టే తెలుగు డయాస్పోరా సదస్సుకు హాజరవుతారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులతోనూ CBN చర్చిస్తారు. NOV 14, 15 తేదీల్లో జరిగే VSP సమ్మిట్‌కు ఆయా సంస్థలను ఆహ్వానించనున్నారు.