News February 11, 2025
ఇకపై ఆ రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం

విజయవాడ- సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే శాతవాహన ఎక్స్ప్రెస్లను(నం.12713& 12714) మోడరన్ లింక్డ్ హాఫ్మన్ బుష్(LHB) కోచ్లతో నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నేడు సోమవారం నుంచి LHB కోచ్లతో నడిచే విధంగా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఈ రైలును అభివృద్ధి చేశామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
Similar News
News November 16, 2025
వచ్చే 2 రోజులు అధికంగా చలిగాలుల ప్రభావం

TG: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజులు చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రేపు పశ్చిమ, ఉత్తర తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6-9 డిగ్రీలకు, హైదరాబాద్లో 7-11 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్ ఉందని తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
News November 16, 2025
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్న నిరుద్యోగులు

కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన జాబ్ మేళా నిరుద్యోగుల పాలిట వరమని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. ఆదివారం జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ముందుకు సాగాలని సీఎండీ బలరాం సూచించారు. చదువు ఒకటే మనిషి జీవితాన్ని మారుస్తుందని కలెక్టర్ తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజంలో మంచి పేరు సాధించాలని ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు.
News November 16, 2025
డిసెంబరులో గ్లోబల్ సమ్మిట్: Dy.CM భట్టి

తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇది దుబాయ్ ఫెస్టివల్ను మించేలా ఉంటుందన్నారు. ఈ సమ్మిట్లో 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను ప్రపంచానికి పరిచయం చేస్తామన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీ, గచ్చిబౌలి స్టేడియం వంటి వేదికలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.


