News March 10, 2025
ఇక నుంచి ‘కొమురవెళ్లి పుణ్యక్షేత్రం’ రైల్వే స్టేషన్

మనోహరాబాద్- కొత్తపల్లి నుంచి హైదరాబాద్ వరకు వేస్తున్న కొత్త రైల్వే పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయ రైల్వే జంక్షన్కు ‘కొమురవెల్లి పుణ్యక్షేత్రం’ అని నామకరణం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో మరో మూడు స్టేషన్లు గుర్రాలగొంది, చిన్నలింగపూర్, సిరిసిల్ల పేర్లను లిస్టులో పెట్టారు.
Similar News
News April 16, 2026
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్కు చెందిన లోన్ అకౌంట్లను బ్యాంకులు ఫ్రాడ్గా పేర్కొని దర్యాప్తు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అనిల్ అంబానీ వేసిన పిటిషన్ను SC కొట్టివేసింది. ఈ దశలో స్టే విధించలేమని ధర్మాసనం పేర్కొంది. తొలుత బాంబే HC సింగిల్ బెంచ్ అంబానీకి ఫేవర్గా తీర్పునిచ్చింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, IDBI పిటిషన్ను విచారించిన డివిజన్ బెంచ్ దీనిని పక్కన పెట్టింది.
News April 16, 2026
NZB: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు: DCC అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పసుపు రైతులకు ఇబ్బందులు అని కాంగ్రెస్ NZB జిల్లా అధ్యక్షుడు నగేశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పసుపు కొనుగోళ్ల కోసం కొత్తగా తెచ్చిన 0.2 సాఫ్ట్వేర్లో NZB మార్కెట్ను చేర్చకపోవడం బీజేపీ కుట్రని, దీని వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.
News April 16, 2026
మేడిపల్లి: ‘సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి’

ప్రభుత్వం చేపట్టి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మేడిపల్లి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల వారిగా లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలన్నారు. రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు రుణాలు, సన్న బియ్యం తదితరఅంశాలపై వివరించాలన్నారు.


