News February 17, 2025

ఇచ్చాపురం: ఇటలీలో ఉద్యోగాలంటూ మోసం

image

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. పార్వతీపురానికి చెందిన ఓ ఏజెంట్‌తో కలిసి ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి వాసి ఈ మోసానికి పాల్పడ్డారు. జిల్లాలో ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షలు చొప్పున రూ.3 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దాదాపు 350 మంది నిరుద్యోగులను ఇటలీ పంపగా.. అక్కడ సరైన ఉద్యోగం లేక మోసపోయారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News January 11, 2026

శ్రీకాకుళం: ప్రైవేటు ట్రావెల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

image

సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్‌ హెచ్చరించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, యజమానులతో శనివారం ఆయన సమీక్షా నిర్వహించారు. సంక్రాంతి పండగ రద్దీని ఆసరాగా చేసుకుని అనధికారికంగా ఛార్జీలు పెంచి ప్రయాణికులకు భారం కలిగించవద్దని, బస్సులు ఫిట్నెస్ తప్పనిసరి అన్నారు.

News January 11, 2026

శ్రీకాకుళం: అమృత్ భారత్ రైళ్లు ఆగనున్న స్టేషన్లు ఇవే

image

శ్రీకాకుళం జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లలో అమృత్ భారత్ ఆగనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం తెలిపారు. న్యూ జల్పైగురి-హౌరా-బెంగళూరు మార్గంలో భాగంగా శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో హాల్ట్ కల్పించారు. 16597-98, 16107-07 నంబర్ గల రైళ్లకు శ్రీకాకుళం, పలాసలలో హాల్ట్ కల్పించగా, 202603-04, 20609-10, 16223-24 రైళ్లు శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్ఛాపురంలో ఆగనున్నాయి.

News January 11, 2026

శ్రీకాకుళం: అమృత్ భారత్ రైళ్లు ఆగనున్న స్టేషన్లు ఇవే

image

శ్రీకాకుళం జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లలో అమృత్ భారత్ ఆగనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం తెలిపారు. న్యూ జల్పై గురి-హౌరా-బెంగళూరు మార్గంలో భాగంగా శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో హాల్ట్ కల్పించారు. 16597-98, 16107-07 నంబర్ గల రైళ్లు శ్రీకాకుళం, పలాసలలో హాల్ట్ కల్పించగా, 202603-04, 20609-10, 16223-24 రైళ్లు శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్ఛాపురంలో ఆగనున్నాయి.