News April 1, 2025
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్: అనిత

యువగళం పాదయాత్రలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అనకాపల్లి-అచ్యుతాపురం నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర హోం శాఖామంత్రి వంగలపూడి అనిత గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు మంత్రి రహదారి విస్తరణకు నిధులు మంజూరు చేయడమే కాకుండా సోమవారం శంకుస్థాపన చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 24, 2025
FLASH: సిద్దిపేట జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 25 నుంచి నవంబర్ 9 వరకు సిటీ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు అనుమతులు లేకుండా నిర్వహించకూడని చెప్పారు. బలవంతంగా వ్యాపార సముదాయాలు మూయించడం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 24, 2025
జిల్లా జైలను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జ్

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా కరీంనగర్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ జిల్లా కారాగారాన్ని సందర్శించి, ఖైదీలకు అందుతున్న సేవలను తనిఖీ చేశారు. విచారణ ఖైదీలు జిల్లా కారాగారాన్ని ఒక పరివర్తన కేంద్రంగా భావించాలని, కారాగారంలో గడిపిన కాలంలో సత్ప్రవర్తనతో మెలిగి బయటకు వెళ్లిన తర్వాత క్షణికావేశాలకు లోనుకాకుండా ఉండాలని తెలియజేశారు.
News October 24, 2025
ములుగు: గ్రామీణ రహదారులకు మహర్దశ

గ్రామీణ రహదారులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి సీతక్క అన్నారు. కొత్త రహదారులతో పల్లెల ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు. రూ.74.43 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ములుగు జిల్లా సహా పలు జిల్లాల్లో గ్రామీణ రహదారుల నిర్మాణానికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొత్తం 32 కొత్త రహదారుల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు.


