News April 1, 2025
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్: అనిత

యువగళం పాదయాత్రలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అనకాపల్లి-అచ్యుతాపురం నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర హోం శాఖామంత్రి వంగలపూడి అనిత గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు మంత్రి రహదారి విస్తరణకు నిధులు మంజూరు చేయడమే కాకుండా సోమవారం శంకుస్థాపన చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
HYD: NIMSలో అడ్వాన్స్ టెస్టింగ్

పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయోగశాలని ఆధునికీకరించి రియల్ టైమ్ పీసీఆర్, ఎలిజా, మైక్రో బయాలజికల్ పద్ధతులతో పరీక్షలు చేస్తున్నారు. వైరాలజీ ల్యాబ్లో కరోనా, హెపటైటిస్, డెంగ్యూ, ఇన్ఫ్లుయెన్జా వంటి వైరస్లపై పరిశోధనలు నిర్వహించనున్నట్లు వైద్యులు వెల్లడించారు.
News November 18, 2025
HYD: NIMSలో అడ్వాన్స్ టెస్టింగ్

పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయోగశాలని ఆధునికీకరించి రియల్ టైమ్ పీసీఆర్, ఎలిజా, మైక్రో బయాలజికల్ పద్ధతులతో పరీక్షలు చేస్తున్నారు. వైరాలజీ ల్యాబ్లో కరోనా, హెపటైటిస్, డెంగ్యూ, ఇన్ఫ్లుయెన్జా వంటి వైరస్లపై పరిశోధనలు నిర్వహించనున్నట్లు వైద్యులు వెల్లడించారు.
News November 18, 2025
రూమ్ బుకింగ్ పేరుతో రూ. 18 లక్షలు దోచేశారు..!

రూమ్స్ బుక్ చేస్తే పెట్టుబడికి డబుల్ ఆదాయం వస్తుందని రాజమండ్రికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫణికుమార్ ఇన్స్టాగ్రామ్కు ఓ లింక్ వచ్చింది. లింక్ను ఓపెన్ చేసి తొలుత తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి డబుల్ లాభం పొందాడు. దీంతో నమ్మకం కలిగి, రూ. 18 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు.


