News May 3, 2024
ఇచ్ఛాపురం: జీడితోటలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లోద్దపుట్టి గ్రామ సమీపంలో జీడితోటలో గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్.ఐ లక్ష్మణ్ రావు తెలిపారు. అతడు వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ వ్యక్తి వివరాలు తెలిసిన వారు 63099 90869, 63099 90827 పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Similar News
News December 11, 2025
శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీకి చెందిన బగాది కృష్ణారావు (86) గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ సుజాత, ఉమా శంకర్ వచ్చి కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
News December 11, 2025
శ్రీకాకుళం: జైల్లో పరిచయం.. బయటకొచ్చి దొంగతనాలు

బూర్జలో చోరీలకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ, కోనసీమ, బిహార్కు చెందిన నాగరాజు, ఆనంద్, శ్రీను, చంటిబాబు, శుభం మిశ్రా పాత కేసుల్లో జైలుకెళ్లారు. బయటొచ్చాక గాజువాకలో స్థిరపడ్డారు. శ్రీను అత్తగారి ఊరు శ్రీకాకుళం జిల్లా బూర్జ. ఆ గ్రామానికి చెందిన రమేశ్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని శ్రీను గమనించాడు. ఈ నెల 1న అందరూ కలిసి దొంగతనం చేసినట్లు DSP వివేకానంద తెలిపారు.
News December 11, 2025
శ్రీకాకుళం కలెక్టర్కు 15వ ర్యాంక్

సిక్కోలు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 15వ ర్యాంకు సంపాదించారు. ఆయన వద్దకు ప్రజల సమస్యలపై 931 ఫైల్స్ రాగా 703 పరిష్కరించారు. ఒక్కో ఫైల్ను పరిష్కరించేందుకు ఆయన 2 రోజుల 3 గంటల సమయం తీసుకున్నారు. దీంతో ఆయన పనితీరుకు CM చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాంక్ ఇచ్చారు


