News July 21, 2024
ఇచ్ఛాపురం: డెంగ్యూ జ్వరంతో బీటెక్ విద్యార్థి మృతి

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణం దానంపేటకు చెందిన తిప్పన విగ్నేష్ (21) డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. ఇటీవల డెంగ్యూ జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరిన విగ్నేష్ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ సైనిక్ ఉద్యోగికి రమణారెడ్డికి ఒక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు.
Similar News
News November 4, 2025
శ్రీకాకుళం: ఆమె నేత్రాలు సజీవం

శ్రీకాకుళంలోని అరసవల్లికి చెందిన మాడుగుల. ఇందిరా (36) ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, చిన్ని కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
News November 4, 2025
మెళియాపుట్టి: ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా..!

ప్రతిరోజూ ఏదోక చోట బస్సు ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ కొందరి వైఖరిలో మార్పులు రావడం లేదు. ఈ నేపథ్యంలో మెళియాపుట్టి (M) గొప్పిలిలో ప్రయాణికులు ఫుట్ బోర్డుపై వేలాడుతూ వెళ్తున్న దృశ్యం నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లు కనిపిస్తోంది. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోక ముందే అధికారులు తనిఖీలు చేపట్టి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News November 4, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

➤పాపం పసి ప్రాణం.. పుట్టడమే శాపమా ?
➤శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్ కు 52 అర్జీలు
➤శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల పూజలు
➤గ్రామాల అభివృద్ధికి కూటమి కృషి:  అచ్చెన్న, రామన్న
➤శ్రీకాకుళం: 80సార్లు అర్జీలిచ్చాం..అడుగు రోడ్డు వేయలేదు
➤దర్శనాలకు ఆటంకం లేకుండా చర్యలు: హిరమండలం ఎస్సై
➤ హామీ అమలుతో శ్రీకాకుళం జిల్లాలో 1,350 మందికి మేలు


