News March 6, 2025
ఇచ్ఛాపురం: మద్యం దుకాణాలకు ఎంపిక నేడు

ఇచ్చాపురం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలకు అభ్యర్థులను గురువారం రోజున లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సీఐ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా.. జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కాలేజీ రోడ్డు అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉ.8 గం.లకు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వారు ఎంట్రీపాస్, ఆధార్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ తేవాలన్నారు.
Similar News
News March 6, 2025
SKLM: పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం (పి-4) సర్వేకు కార్యాచరణ రూపొందించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను ఉపయోగించి ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రారంభించి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
News March 6, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలలో 815 మంది గైర్హాజర్

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలలో భాగంగా
గురువారం పరీక్షకు 815 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. జనరల్లో 21156 మంది, ఒకేషనల్లో 1342 మంది పరీక్షల్లో హాజరు కావలసి ఉందని వివరించారు. మొత్తంగా 22498 మందికి గాను 21683 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.
News March 6, 2025
శ్రీకాకుళం: 18 షాపులు కేటాయింపు

పారదర్శకంగా లాటరీ పద్ధతిలో 18 బ్రాందీ షాపులు కేటాయించినట్లు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. గురువారం శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో లాటరీ పద్ధతిలో గీత కార్మికులకు, సొండి కులస్థులు సమర్పించిన ధ్రువపత్రాల ప్రకారం ఆయా కేటగిరిలో కేటాయించామన్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు, అధికారులు పాల్గొన్నారు.