News February 17, 2025

ఇచ్ఛాపురం: శుభకార్యానికి వెళ్లొస్తూ వ్యక్తి మృతి

image

ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామానికి చెందిన రంగాల కృష్ణారెడ్డి ఆదివారం  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు వివరాల మేరకు.. ధర్మపురం గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్టర్‌ను తప్పించబోయి బైక్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.

Similar News

News March 19, 2025

SKLM: పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

image

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే ఫిర్యాదులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్ బ్యాంక్, కోర్టు కేసులు, వక్ఫ్ ఆస్తుల సర్వే వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News March 18, 2025

శ్రీకాకుళం: అంగన్వాడీ కేంద్రాల పనివేళలు ఇవే.. 

image

అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి. శాంతి శ్రీ మంగళవారం తెలిపారు. వేసవి దృష్ట్యా మార్చి నెల 18వ తేదీ నుంచి మే నెల 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలు సమయం మార్చినట్లు పేర్కొన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు వేడి ఆహారం ఇచ్చి పిల్లలను వారి వారి గృహాలకు పంపాలని ఆమె తెలిపారు.

News March 18, 2025

కోటబొమ్మాళి: రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

కోటబొమ్మాళి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ మంగళవారం తెలిపారు. మృతుడి వయసు 50 – 55 సంవత్సరాలు మధ్య ఉంటుందన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!