News February 25, 2026
ఇజ్రాయెల్ ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తుందా?

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నెతన్యాహు అంతకుముందు ప్రతిపాదించిన ‘Hexagon of Alliances’ చర్చనీయాంశమైంది. మిడిల్ ఈస్ట్లో తీవ్రవాదం పోరుకు భారత్ సహా ఆరు దేశాలతో కూటమి ఏర్పాటు చేయాలనేది నెతన్యాహు ప్రపోజల్. మోదీతో భేటీలో దీనిని ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఇది పరోక్షంగా ఇరాన్ను టార్గెట్ చేసే అవకాశం ఉండటంతో మిత్రదేశమైన భారత్ దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం.
Similar News
News April 12, 2026
దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)
News April 12, 2026
విజయ్ బ్రేకులు.. వర్క్ఫ్రమ్ హోమ్ అంటూ DMK సెటైర్లు

తమిళనాడు ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. ఈ తరుణంలో TVK చీఫ్ విజయ్ తన ప్రచార సభలను వరుసగా రద్దు చేసుకోవడంపై DMK విమర్శలు గుప్పించింది. నేతలంతా ప్రజల్లో తిరుగుతుంటే ఆయన మాత్రం బ్రేకులు తీసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని ఎద్దేవా చేసింది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. విజయ్ ఇంకా చాలా జిల్లాలు కవర్ చేయాల్సి ఉండటంతో నేరుగా జనం మధ్యకు వెళ్తేనే ఓట్లు వస్తాయని విశ్లేషకులు సూచిస్తున్నారు.
News April 12, 2026
హార్ముజ్లో టెన్షన్.. పాక్ ట్యాంకర్ యూటర్న్

హార్ముజ్ జలసంధి దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నాయి. పాక్, ఇరాక్కు చెందిన ఈ నౌకలు ఒమన్ గల్ఫ్ నుంచి పర్షియన్ గల్ఫ్లోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్ దగ్గరకు రాగానే వెనక్కి వెళ్లాయి. నిజానికి పాక్, ఇరాక్ నౌకలకు తొలుత ఇరాన్ అనుమతి ఇచ్చింది. కానీ చర్చలు ఫెయిల్ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.


