News March 25, 2025

ఇటిక్యాల: ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

image

ఇటిక్యాల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు ఈరోజు పనులను తనిఖీ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని జాబ్ కార్డు ఉన్న ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఇటిక్యాల ఎంపీడీవో, ఎర్రవల్లి ఎంపీడీవో, ఇతర ఉన్నతాధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేశ్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 19, 2025

సిద్దిపేట: CP పనితీరుపై ప్రశంసల జల్లు

image

సీపీ విజయ్ కుమార్ పనితీరుపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్టోబర్‌లో సీపీగా బాధ్యతలు తీసుకున్న ఆయన ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి సామాన్య రైతుతో అవగాహన కల్పించి అందరి మన్ననలు పొందారు. తాగి డ్రైవింగ్ చేసి పట్టుపడితే రూ.10 జరిమానా నిబంధనలకు సైతం మద్దతు లభించింది. సుభాష్ రోడ్, మార్కెట్ రద్దీకి చెక్ పెట్టారు.

News November 19, 2025

హసీనాకు మరణశిక్ష.. కుమారుడి స్పందనిదే..

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు <<18311087>>మరణశిక్ష<<>> విధిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయంపై ఆమె కుమారుడు సాజిబ్ వాజీద్ స్పందించారు. కేసుల విచారణలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం న్యాయ ప్రక్రియను పాటించలేదని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ మార్పుకు జో బైడెన్ సర్కారు మిలియన్ డాలర్లు వెచ్చించిందని విమర్శించారు. అయితే, ట్రంప్ ప్రభుత్వ వైఖరి వేరుగా ఉందని సాజిబ్ అభిప్రాయపడ్డారు.

News November 19, 2025

బి.టి పత్తికి గులాబీ రంగు పురుగుతో ముప్పు

image

బి.టి పత్తిని నవంబర్, డిసెంబర్ నెలలో గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు చిన్న లార్వాలు పూమొగ్గలు, లేతకాయలకు చిన్న రంద్రాలు చేసి లోపలకి ప్రవేశిస్తాయి. పూలలోని మొగ్గలను తినేయడం వల్ల పూలు విచ్చుకోవు. కాయల లోపలి భాగాన్ని తినేయడం వల్ల కాయ ఎదగదు. అలాగే ఇవి కాయల్లోని విత్తనం లోపలి భాగాన్ని, దూదిని కొరికి తినడం వల్ల దూది నాణ్యత తగ్గి రంగు కూడా మారుతుంది. ఫలితంగా దిగుబడి, రాబడి తగ్గుతుంది.