News January 31, 2025
ఇట్యాలలో 8కుటుంబాల కులబహిష్కరణ

మనిషి ఆధునిక ప్రపంచం వైపు ప్రయాణిస్తున్న ఆచార వ్యవహారాలు కాలం చెల్లిన కట్టుబాట్లను మాత్రం వదలడం లేదు. బాధితుల కథనం ప్రకారం.. దహేగాం మండలం ఇట్యాలలో 8 కుటుంబాలు కుల బహిష్కరణకు గురయ్యాయని బాధితులు వాపోయారు. ఇద్దరి మధ్య గొడవలో పెద్దమనుషులు ఒక కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారన్నారు. వారితో మాట్లాడినందుకు 8 కుటుంబాలను బహిష్కరించారన్నారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను వారు వేడుకున్నారు.
Similar News
News November 25, 2025
అల్లూరి: ఓటర్ల మ్యాపింగ్పై కలెక్టర్ సమీక్ష

2002 నాటి ఓటర్ల మ్యాపింగ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 లక్ష్యం, 2002లో 35 ఏళ్లు పైబడిన ఎలక్టార్స్ 2025లో ఉంటే వారి మ్యాపింగ్ను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్లో
మంగళవారం ఆయన అత్యవసర సమావేశం నిర్వహించి మాట్లాడారు. అన్ని నియోజకవర్గాల EROలు, MROలు, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ఆదేశించారు.
News November 25, 2025
నేటి నుంచి మల్దకల్లో తిమ్మప్ప బ్రహ్మోత్సవాలు

స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) ఆలయంలో మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు తెలిపారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
News November 25, 2025
సిరిసిల్ల: ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అందే నీరజ(27) మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, మృతురాలి భర్త దేవరాజ్ గల్ఫ్ దేశంలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు.


