News August 7, 2024
ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఉన్న ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థిని జమీషా ఖురేషి (17)అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి క్యాంపస్లోని బ్రాత్ రూంలో తన చున్నీతో ఉరి వేసుకొన్న సంఘటనను విద్యార్థులు, సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2025
కడప జిల్లా ఎస్పీని కలిసిన మహిళా పోలీసులు

కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఈజీ అశోక్ కుమార్ను జిల్లా మహిళా పోలీసుల అసోసియేషన్ మంగళవారం కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో కలిశారు. నూతనంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కలిశామన్నారు. అనంతరం మహిళా పోలీసుల సంక్షేమానికి కృషి చేయాలని ఎస్పీని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కే వసంత లక్ష్మి, జిల్లా ప్రెసిడెంట్ ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
News February 11, 2025
కడప జిల్లాలో విషాదం.. తల్లి, కొడుకు మృతి

కడప జిల్లా బి.కోడూరు మండలం గుంతపల్లిలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో తల్లి, కుమారుడు మృతి చెందారు. తల్లి గురమ్మ, కుమారుడు జయసుబ్బారెడ్డి పొలానికి నీళ్లు పెడుతుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు ఎస్ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 11, 2025
కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ అవినాశ్

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అణుశక్తి సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ను కలిసి సమస్యలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు సమర్పించారు. చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లే రైలుకు కడపలో స్టాపింగ్ ఇవ్వాలని కోరారు. తిరుపతి నుంచి షిరిడీకి ప్రతిరోజు రైలు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పులివెందుల యురేనియం ఫ్యాక్టరీ సమస్యలను విన్నవించారు.