News December 27, 2024
ఇడుపులపాయలో వింతాకృతిలో పుట్టగొడుగు

వేంపల్లి మండలం ఇడుపులపాయ గ్రామ సమీపంలోని కొండ్రుతు వంకలో శుక్రవారం మనిషి కాలి ఆకృతిలో పుట్టగొడుగు దర్శనమిచ్చింది. ఈ పుట్టగొడుగును చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపుతున్నారు. నెలరోజుల క్రితం ఇదే ప్రాంతంలో మనిషి చేతివేళ్ల ఆకారంలో పుట్టగొడుగు బయటపడిన విషయం తెలిసిందే. ఈ విషయమై హెచ్ఓ రెడ్డయ్యను వివరణ కోరగా.. జన్యు లోపంతో ఇలాంటి పుట్టగొడుగులు పుట్టుకొస్తాయన్నారు.
Similar News
News November 21, 2025
ప్రొద్దుటూరులో బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్.!

పొద్దుటూరు పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.10.56 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాలో కీలక వ్యక్తులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ధనికల వీరశంకర్, కాశినాయన మండలానికి చెందిన ఆర్ల చంద్ర యాదవ్ను శుక్రవారం డీఎస్పీ భావన ఆధ్వర్యంలో సీఐ సదాశివయ్య అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.
News November 21, 2025
కడపలో నేడు వాహనాల వేలం

కడప జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు వాహనాలు పట్టుబడ్డాయి. ఈక్రమంలో 9 వాహనాలకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. కడపలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని అధికారులు కోరారు.
News November 21, 2025
కడప: తప్పు చేసిన వారితోనే సరి చేయించండి!

ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో తప్పు చేసిన వారితోనే సరిచేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో వైసీపీ హయాంలో పేజ్ -3లో 13,681 ఇళ్లులు మంజూరయ్యాయి. వాటిలో పునాది దశ దాటని 6298 ఇళ్లకు బిల్లులు చేశారు. ఆ ఇళ్లపై నిన్న విజయవాడలో గృహనిర్మాణ శాఖ కమిషనర్, ఎండి వద్ద సమావేశం జరిగింది. ఆ ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారితోనే పూర్తి చేయించాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు నిర్ణయించారు.


