News July 22, 2024

ఇడుపులపాయ: నేటి నుంచే ఆర్జీయూకేటీ అడ్మిషన్లు!

image

ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ IIIT గ్రంథాలయం వేదికగా IIIT 2024-25 విద్యా సంవత్సర ప్రవేశాల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు జులై 22, 23వ తేదీలలో ఆర్కేవ్యాలీ IIIT, 24, 25 తేదీలలో ఒంగోలు IIIT అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా తొలి జాబితాలో ఎంపికైన విద్యార్థులకు సోమవారం ధ్రువపత్రాలు పరిశీలించి అడ్మిషన్లు కల్పించనున్నారు.

Similar News

News November 17, 2025

19న కడప జిల్లాకు సీఎం చంద్రబాబు..?

image

సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాకు వస్తారని సమాచారం. కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెండ్లిమర్రి మండలంలో ఆయన రైతులతో సమావేశమవుతారు. పీఎం కిసాన్ నిధుల విడుదల తర్వాత క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేడు లేదా రేపు అధికారికంగా షెడ్యూల్ రానుంది.

News November 17, 2025

కడప: ‘మహిళలు ఉపాధి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి’

image

కడపలోని కెనరా బ్యాంక్ శిక్షణ శిబిరం నందు నిర్వహించే శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి అని సంస్థ డైరెక్టర్ ఆరిఫ్ పేర్కొన్నారు. నవంబర్ 17వ తేదీ నుంచి 45 రోజుల పాటు మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. టైలరింగ్, బ్యూటీ పార్లర్ విభాగాలలో శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.

News November 16, 2025

కడపలో రైలు ఢీకొని విద్యార్థి మృతి

image

కడప రైల్వే స్టేషన్‌లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని సతీశ్ (24) అనే బీటెక్ విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. సతీశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలో అన్నమాచార్య కాలేజీలో బీటెక్ చదువుతున్నాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.