News January 2, 2025
ఇడుపులపాయ: IIIT విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే.!

కడప జిల్లా వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ IIIT విద్యార్థులకు ఈనెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గుప్తా తెలిపారు. గురువారం స్థానిక ట్రిపుల్ ఐటీలో ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు వారం రోజులపాటు సెలవులను ప్రకటించామన్నారు.
Similar News
News November 17, 2025
మైదుకూరు ఎమ్మెల్యే కేసులో నిందితుల అరెస్ట్

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను బెదిరించిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేను బెదిరించి రూ.1.70 కోట్లు కాజేశారు. తాజాగా ఈ కేసులోని నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉండడం గమనార్హం.
News November 17, 2025
మైదుకూరు ఎమ్మెల్యే కేసులో నిందితుల అరెస్ట్

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను బెదిరించిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేను బెదిరించి రూ.1.70 కోట్లు కాజేశారు. తాజాగా ఈ కేసులోని నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉండడం గమనార్హం.
News November 17, 2025
ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..?

ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన 43మంది అధికారులపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.


