News June 3, 2024
ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం : కేటీఆర్

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ <<13368558>>హిందూపూర్ వాటర్ ట్యాంక్లో <<>>మృతదేహం లభించిన ఘటనపై ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విటర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు.
Similar News
News October 29, 2025
దేవరకొండ బడిలోకి చేరిన వరద.. మంత్రి కోమటిరెడ్డి ఆరా

దేవరకొండ(M) కొమ్మేపల్లి ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ పాఠశాలలోకి వర్షపు నీరు చేరిన ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరా తీశారు. కొమ్మేపల్లి ST వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రహరీ లేకపోవడం, లోతట్టు ప్రాంతంలో ఉండడం వంటి కారణాల వల్ల హాస్టల్లోకి నీరు ప్రవేశించిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రికి వివరించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
News October 29, 2025
విషాదం: 10 రోజులకే వీడిన బంధం.. నవవధువు మృతి

NLG: గుర్రంపోడు(M)లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. చామలేడుకు చెందిన సిలువేరు నవీన్, 10 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న తన భార్యతో కలిసి బైక్పై గుర్రంపోడుకు వెళుతున్నారు. వారు బ్రిడ్జిపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా మలుపు తిప్పుతున్న మరో బైక్ను చూసి నవీన్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దంపతులిద్దరూ బైక్పై నుంచి ఎగిరి పడగా ఈ దుర్ఘటన జరిగింది.
News October 29, 2025
అక్రమ దత్తత.. ఏడుగురు అరెస్ట్: నల్గొండ ఎస్పీ

2 వేర్వేరు కేసులలో 10 రోజుల ఆడ శిశువును, 21 రోజుల మగ శిశువును అక్రమ దత్తత చేసిన ఏడుగురు వ్యక్తులను జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం వెల్లడించారు. ఆడపిల్ల పుట్టిందని భారంగా భావించి ఒకరు, డబ్బుల కోసం మరొకరు కన్నపేగు బంధం మరిచి పిల్లలను అమ్ముకోగా.. జిల్లా పోలీసులు ఇద్దరు చిన్నారులను రక్షించి శిశు గృహకు తరలించారు.


