News February 4, 2025
ఇది ప్రజాస్వామ్య ఓటమి: రోజా

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమి.. ప్రజాస్వామ్య ఓటమి అని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ‘తిరుపతి మేయర్ డా.శిరీషని విధుల నిర్వహణలో అవమానించారు. కార్పొరేషన్ సమావేశం లోపల జరుగుతుంటే బయట మేయర్ ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడటం దేనికి సంకేతం’ అని రోజా X వేదికగా ప్రశ్నించారు.
Similar News
News February 23, 2026
T20 WC: భారత్కు అన్నీ ప్రతికూలాంశాలే!

T20 WC చరిత్రలో ఇప్పటివరకు హోస్ట్ నేషన్ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. అలాగే ఏ టీమ్ కూడా వరుస ఎడిషన్లలో ఛాంపియన్ కాలేదు. దీంతో ఈ సెంటిమెంట్లను భారత్ బ్రేక్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. 2024 WCని గెలవడంతో పాటు ఈసారి SLతో కలిసి IND టోర్నీని హోస్ట్ చేస్తోంది. మరోవైపు S8లో తొలి మ్యాచులోనే ఓడటం, NRR -3.800గా ఉండటం, ప్లేయర్ల ఆట తీరు, తుది జట్టు కూర్పులో సందిగ్ధం జట్టుకు ప్రతికూలంగా మారాయి.
News February 23, 2026
కర్నూలు జిల్లాలో రైతులకు పుష్కలంగా యూరియా నిల్వలు

కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. 2025-26 రబీ సీజన్ కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశారు. యూరియాను అధిక ధరలకు అమ్మినా, ఇతర ప్రాంతాలకు తరలించినా డీలర్ల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల కొరతపై ఫిర్యాదుల కోసం 8341302863 నంబర్ను సంప్రదించాలని ఆమె సూచించారు.
News February 23, 2026
HYD: MCHRD.. CM క్యాంప్ ఆఫీస్ కాబోతుందా..?

HYDలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCRHRD)లో VVIP గెస్ట్ హౌస్ రూపురేఖలు మారబోతున్నాయి. అతిథుల భద్రతే లక్ష్యంగా దాదాపు రూ.9 కోట్లతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంపౌండ్ వాల్కు కాన్సర్టినా వైర్ ఫెన్సింగ్, అత్యాధునిక వాచ్ టవర్లు, పటిష్ఠమైన గేట్లతో పాటు పరిసరాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించనున్నారు. దీనిని CM క్యాంప్ ఆఫీస్గా వాడనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


