News March 18, 2024
ఇది యూకేజీ ఫీజా.. ఆస్తులు అమ్మాల్సిందే!
పిల్లల్ని కిండర్గార్టెన్(కేజీ) చదివించాలంటే సాధారణంగా ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండొచ్చు. అంతేకదా..? కానీ ఓ పాఠశాలలో మాత్రం అక్షరాలా రూ.2,72,718 కట్టాల్సి ఉంటుంది. అందులో రూ.33వేలు తర్వాత రిఫండ్ ఇస్తారట. దీనికి సంబంధించి ఓ ఫొటో వైరల్ అవుతోంది. ‘ఇది యూకేజీ ఫీజా..? పిల్లల్ని ఇలా చదివించాలంటే మా ఆస్తులు అమ్మాల్సిందే’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News September 30, 2024
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు ఊరట
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై నమోదైన ఎలక్టోరల్ బాండ్స్ కేసులో విచారణపై స్టే విధించింది. ఈ కేసులో ఫిర్యాదుదారునిపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని గమనించామని, అలాగే కేసుని దోపిడీకి సంబంధించిన అంశంగా పరిగణించట్లేదని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేసింది. అప్పటివరకు ఇన్వెస్టిగేషన్పై స్టే విధించింది.
News September 30, 2024
ALERT.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
☞ ICICI డెబిట్ కార్డుతో గత త్రైమాసికంలో రూ.10000 వాడితే ప్రస్తుత త్రైమాసికంలో 2 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్టు లాంజ్ యాక్సెస్లు పొందవచ్చు
☞ HDFC క్రెడిట్ కార్డుతో ఒక త్రైమాసికంలో ఒక యాపిల్ ఉత్పత్తిపైనే రివార్డు రిడీమ్ చేసుకోవచ్చు
☞ పన్ను రిటర్నుల్లో ఇకపై ఆధార్ నంబర్ మాత్రమే వాడాలి
☞ F&O ట్రేడింగ్లో ఆప్షన్ కాంట్రాక్టును విక్రయిస్తే ప్రీమియంపై STTని 0.1%, ఫ్యూచర్స్ విభాగంలో STT 0.02% చెల్లించాలి.
News September 30, 2024
ఇసుక రవాణా ఛార్జీల సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి కొల్లు
APలో ఇసుక సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్టోబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు. వర్షాకాలంలో వరదల దృష్ట్యా ఇసుక తవ్వకూడదనే NGT నిబంధనల ప్రకారం రీచుల్ని నిలిపివేశామని చెప్పారు. ఇకపై బోట్ మెన్ సొసైటీలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేపడతామన్నారు. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.