News December 26, 2024

ఇది సార్ వైజాగ్ బ్రాండ్..!

image

వైజాగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన బీచ్‌లు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ కారణంగా రాష్ట్రంలో తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలమైనా విశాఖలో బీచ్‌లు చెక్కుచెదరలేదు. రాకాసి అలలు కృష్టా జిల్లాలో 27, నెల్లూరులో 20, ప్రకాశంలో 35 మందిని బలితీసుకోగా.. విశాఖలో ఒక్క ప్రాణం కూడా పోలేదు. దీనికి కారణం ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధంగా సముద్రంలోకి చొచ్చుకొచ్చే కొండలు, డాల్ఫిన్స్ నోస్.

Similar News

News November 27, 2025

విశాఖ: మెడికల్ షాపుల్లో తనిఖీలు.. ఒకటి సీజ్

image

విశాఖలో పలుచోట్ల డ్రగ్ కంట్రోలర్ సిబ్బంది ఆధ్వర్యంలో మెడికల్ షాపుల తనిఖీలు చేపట్టారు. డాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోహన్ ఫార్మసీ దుకాణాలు నడుస్తున్నాయి. వీటిపై PGRSలో ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేసి ఎంవీపీ బ్రాంచ్ సీజ్ చేశారు. వన్ టౌన్, ఇసుకతోట, ఎంవీపీ, కంచరపాలెం, మల్కాపురం షాపులకు నోటీసులు జారీ చేసినట్లు డ్రగ్ కంట్రోలర్ తెలిపారు. అధిక ధరలు, కాలం చెల్లిన మందులు ఉన్నాయని ఆయన చెప్పారు.

News November 27, 2025

విశాఖ: బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి

image

బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున జరిగింది. సింహాచలం డిపో నుంచి గోపాలపట్నం వైపు బస్సు వెళుతుండగా.. రోడ్డు మీద నడుస్తున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా చక్రాల కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గోపాలపట్నం ఎస్సై అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 26, 2025

28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

image

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.