News April 10, 2024
ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన రైల్వే కానిస్టేబుల్

బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన వాసీమ కుటుంబకలహాలతో జీవితంపై విరక్తి చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు మైక్రో స్టేషన్ క్వారీకి వెళ్లింది. ఆమె భర్త షబ్బీర్ విషయం తెలుసుకుని జీఆర్పీ కానిస్టేబుల్ ఎండీ రషీద్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన రైల్వే కానిస్టేబుల్ ఘటనాస్థలికి చేరుకుని కాపాడాడు. ముగ్గురి ప్రాణాలను
కాపాడిన కానిస్టేబుల్ను స్థానికులు అభినందించారు.
Similar News
News November 19, 2025
ADB: ఆపదమిత్ర శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం

విపత్తుల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన ‘ఆపదమిత్ర’ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ, భారత్ స్కౌట్స్ గైడ్స్ చీఫ్ కమీషనర్ రాజేశ్వర్ తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు గల స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ హైదరాబాద్లో వారంపాటు ఉంటుందని వివరించారు.
News November 19, 2025
జైనథ్: 8 మంది దొంగల అరెస్ట్

ఈ నెల 14న జైనథ్లోని హాత్తిఘాట్ పంపుహౌస్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన రూ.4.8 లక్షల సామగ్రిని రికవరీ చేశారు. మంగళవారం 12 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. దొంగిలించిన సామగ్రి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రూ.7,140 నగదును స్వాధీనం చేసుకున్నారు. సామగ్రి కొనుగోలు చేసిన స్క్రాప్ దుకాణదారుడిని కూడా రిమాండ్కు పంపినట్లు సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.
News November 18, 2025
ఆదిలాబాద్లో రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు

బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తలపెట్టిన బంద్ను విరమించుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేటు ద్వారా పత్తి కొనుగోళ్లు యథావిధిగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని సూచించారు.


