News March 11, 2025
ఇనాం భూముల సమస్యలు పరిష్కరించండి: గంటా

ఇనాం భూముల సమస్యలను పరిష్కరించాలని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో కోరారు. ఆ భూములపై యాజమన్య హక్కులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వారి ఆధీనంలో ఉన్నా సరే పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకొని మధ్యే మార్గంగా సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందన్నారు.
Similar News
News December 7, 2025
విశాఖ: రోడ్డు ప్రమాదంలో స్టీల్ ప్లాంట్ కార్మికుడి మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో చిన్నారావు తన బైక్పై ఇంటికి వెళుతుండగా వడ్లపూడి బ్రిడ్జిపై ఓ వాహనం ఢీంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలిని పరిశీలించిన దువ్వాడ పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.
News December 7, 2025
విశాఖలో రాత్రి పరిశుభ్రతపై జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, సత్యం జంక్షన్, సీతమ్మధర, డైమండ్ పార్క్, తదితర ప్రాంతాల్లో రాత్రి పరిశుభ్రత పనులను తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడి బాధ్యతగా పని చేయాలని సూచించారు. నగర పరిశుభ్రత కోసం రాత్రి సానిటేషన్ కీలకమని, వాణిజ్య ప్రాంతాల్లో వ్యర్థాల సమయానుసార సేకరణ తప్పనిసరి అని కమిషనర్ పేర్కొన్నారు.
News December 7, 2025
పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతో వన్డే మ్యాచ్ విజయవంతం

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఇండియా-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్కు నగర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సీపీ శంఖబ్రత భాగ్చి ఆధ్వర్యంలో స్టేడియం చుట్టుపక్కల భారీగా సిబ్బందిని మోహరించి, డ్రోన్లతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధమైన నియంత్రణతో భద్రతను విజయవంతంగా నిర్వహించారు.


