News August 15, 2024

ఇన్ ఫార్మర్ నెపంతో విద్యార్థిని కొట్టి చంపిన మావోయిస్టులు

image

చర్ల సరిహద్దు ప్రాంతం సుక్మా జిల్లా పువర్తికి చెందిన 16 ఏళ్ల శంకర్‌ను మావోయిస్టులు దారుణంగా కొట్టి చంపారు. పల్నార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న శంకర్.. పోలీస్ ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నట్లు నక్సల్స్ అనుమానించారు. బుధవారం అర్ధరాత్రి అతడి ఇంటికి చేరుకున్న మావోయిస్టులు శంకర్ ను కొద్దిదూరం తీసుకెళ్లి మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 12, 2025

వారినే వరించనున్న.. ఖమ్మం DCC, నగర అధ్యక్ష పదవి

image

ఖమ్మం DCC, నగర అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఈ మేరకు AICC పరిశీలకుడు మహేంద్రన్ నేతల అభిప్రాయాలు సేకరించారు. ఈనెల 19 వరకు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమై, దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆరేళ్ల తర్వాత ఈ పదవులకు దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పదవులు ఎవరికిస్తే బాగుంటుంది. కామెంట్.

News October 11, 2025

ఖమ్మం: బావిలో పడి రైతు మృతి

image

తిరుమలాయపాలెం మండలం పడమటితండాకు చెందిన రైతు భూక్య భద్రు (కోటి) శనివారం తన వ్యవసాయ క్షేత్రంలోని బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 11, 2025

ప్రజా పాలనలో గ్రామాలు దూసుకెళ్తున్నాయ్: పొంగులేటి

image

నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలా కాకుండా తమ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.