News August 15, 2024
ఇన్ ఫార్మర్ నెపంతో విద్యార్థిని కొట్టి చంపిన మావోయిస్టులు

చర్ల సరిహద్దు ప్రాంతం సుక్మా జిల్లా పువర్తికి చెందిన 16 ఏళ్ల శంకర్ను మావోయిస్టులు దారుణంగా కొట్టి చంపారు. పల్నార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న శంకర్.. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నట్లు నక్సల్స్ అనుమానించారు. బుధవారం అర్ధరాత్రి అతడి ఇంటికి చేరుకున్న మావోయిస్టులు శంకర్ ను కొద్దిదూరం తీసుకెళ్లి మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 11, 2025
ఖమ్మం: LRSలో న్యాయం చేయాలి: బాధితులు

ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన LRS తప్పుల తడకగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తప్పుడు లెక్కలతో ల్యాండ్ వాల్యూ ఎక్కువగా నమోదు చేయడంతో అనేక మంది రూ.వేలు, లక్షల అదనంగా చెల్లించి నష్టపోయారు. అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించే దిశగా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని, తక్షణమే తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
News October 11, 2025
ఖమ్మం: గ్రీస్లో 1000 ఉద్యోగాలు.. APPLY చేసుకోండి

గ్రీస్లోని హాస్పిటాలిటీ, సేవా రంగాలలో 1,000 విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా/డిగ్రీ ఉన్నవారు, ప్రభుత్వ అనుమతితో నైపుణ్య ధ్రువీకరణ పొందిన అభ్యర్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగలవారు తమ రెజ్యూమ్లను tomcom.resume@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు.
News October 11, 2025
ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు. ఈ నెల 13 నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని తెలిపారు. నగరంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని, మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.