News August 15, 2024
ఇన్ ఫార్మర్ నెపంతో విద్యార్థిని కొట్టి చంపిన మావోయిస్టులు

చర్ల సరిహద్దు ప్రాంతం సుక్మా జిల్లా పువర్తికి చెందిన 16 ఏళ్ల శంకర్ను మావోయిస్టులు దారుణంగా కొట్టి చంపారు. పల్నార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న శంకర్.. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నట్లు నక్సల్స్ అనుమానించారు. బుధవారం అర్ధరాత్రి అతడి ఇంటికి చేరుకున్న మావోయిస్టులు శంకర్ ను కొద్దిదూరం తీసుకెళ్లి మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 9, 2025
ఈ నెల 23లోగా అభ్యంతరాలు తెలపాలి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్పై ప్రజలు తమ అభ్యంతరాలను ఈ నెల 23వ తేదీలోపు తెలియజేయాలని కలెక్టర్ అనుదీప్ కోరారు. మాన్యువల్ స్కావెంజర్స్ రిహాబిలిటేషన్ చట్టం-2013 ప్రకారం సర్వే కమిటీలు ఏర్పాటు చేయగా, జిల్లాలో స్కావెంజర్లను గుర్తించలేదని కలెక్టర్ తెలిపారు. ఎవరికైనా అభ్యంతరాలు లేదా సమాచారం ఉంటే కలెక్టరేట్లోని షెడ్యూల్ కులాల అభివృద్ధి (SC Development) కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు.
News October 9, 2025
స్థానిక పోరు.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

స్థానిక సంస్థల ఎన్నికలకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం అభ్యంతరం చెప్పకపోవడంతో గురువారం(నేడు) MPTC/ZPTC నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైంది. మొదటి విడుతలో జిల్లాలోని 20 ZPTC స్థానాలకు గానూ 10, 283 MPTC స్థానాలకు గానూ 149 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో ఆశావహుల్లో జోష్ నెలకొంది.
News October 9, 2025
బాలల డాక్యుమెంట్లు 15 రోజుల్లో జారీ చేయాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు 15 రోజుల్లోగా ఆధార్, కుల ధ్రువపత్రాలు సహా ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్లను జారీ చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోక్సో కేసులపై చర్యలు వేగవంతం చేసి, అర్హులైన వారికి పరిహారం అందించాలని సూచించారు. పిల్లల భద్రతకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.