News February 27, 2026

ఇప్పుడు టీమ్‌ఇండియా సెమీస్ చేరాలంటే..

image

T20 WC: జింబాబ్వేపై 72 రన్స్ తేడాతో గెలిచిన భారత్ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకొంది. ప్రస్తుతం గ్రూప్-1లో సౌతాఫ్రికా సెమీస్ చేరింది. రెండో స్థానం కోసం ఇండియా, విండీస్ పోటీ పడుతున్నాయి. మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సెమీస్‌కు వెళ్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్ వర్షంతో రద్దైనా లేదా ఇంకే కారణం వల్లైనా ఫలితం తేలకుండా పోయినా బెస్ట్ రన్ రేట్ ఉన్న వెస్టిండీస్ ముందుకెళ్తుంది.

Similar News

News April 16, 2026

రాత్రి బ్రష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

image

రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచించారు. ‘రోజంతా తిన్న ఆహారం, చక్కెర దంతాలపై ఒక పొరలా పేరుకుపోతాయి. రాత్రి బ్రష్ చేయకపోతే గంటల తరబడి అలాగే ఉండి బాక్టీరియా పెరుగుతుంది. అది ఎనామెల్‌ను దెబ్బతీసి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు దారి తీస్తాయి. నోటి దుర్వాసన పెరుగుతుంది. అందుకే రాత్రి భోజనం చేశాక నిద్ర పోయే ముందు బ్రష్ చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
Share It

News April 16, 2026

రాత్రి బ్రష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

image

రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచించారు. ‘రోజంతా తిన్న ఆహారం, చక్కెర దంతాలపై ఒక పొరలా పేరుకుపోతాయి. రాత్రి బ్రష్ చేయకపోతే గంటల తరబడి అలాగే ఉండి బాక్టీరియా పెరుగుతుంది. అది ఎనామెల్‌ను దెబ్బతీసి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు దారి తీస్తాయి. నోటి దుర్వాసన పెరుగుతుంది. అందుకే రాత్రి భోజనం చేశాక నిద్ర పోయే ముందు బ్రష్ చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
Share It

News April 16, 2026

సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతలు

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ ఫొటోలను మాజీ మంత్రి పరిటాల సునీత సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఉన్నారు. కాగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా మహిళా నేతలు అక్కడికి వెళ్లారు.