News July 23, 2024

ఇబ్రహీంపట్నంలో తీవ్ర విషాదం

image

ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డులో ఇంటి ముందు ఆడుకుంటున్న సిద్ధార్థ నాయక్(3) మంగళవారం అదృశ్యం అయ్యాడు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. <<13690032>>గంటల వ్యవధిలోనే ఆడుకుంటూ <<>>ప్రమాదవశాత్తు సమీపంలోని ఎన్టీటీపీఎస్ బూడిద కాలువలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. న్యాయం చేయాలంటూ బాలుడి మృతదేహంతో ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ముందు ఆందోళనకు దిగారు.

Similar News

News October 8, 2024

కృష్ణా: M.Com పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున వర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో M.Com(అకౌంటెన్సీ & బ్యాంకింగ్) చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 22 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 22 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 7, 2024

అభివృద్ధిలో మరో ముందడుగు పడింది: MLA సుజనా

image

NDA ప్రభుత్వ పాలనలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుతో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధిలో మరో ముందడుగు పడిందని విజయవాడ పశ్చిమ MLA సుజనా ట్వీట్ చేశారు. రూ.25 వేల కోట్ల భారీ పెట్టుబడితో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని సుజనా తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాజధాని నుంచి సమీప జిల్లాలలో ప్రాంతీయ ప్రగతి మరింత పెరగనుందని ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News October 7, 2024

లక్ష్యాలు అధిగమించి మంచి పేరు తీసుకురండి: కలెక్టర్

image

ప్రభుత్వపరంగా నిర్ణీత లక్ష్యాలను సమన్వయంతో పూర్తిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ శాఖ జిల్లా అధికారి వారి పరిధిలో ప్రతిరోజు లేదా 2రోజులకు ఒకసారి తప్పనిసరిగా వారి కార్యకలాపాలను సమీక్షించు కోవాలన్నారు.