News March 19, 2024

ఇబ్రహీంపట్నంలో మహిళ మృతదేహం లభ్యం

image

ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం దాములూరు గ్రామం డొంక రోడ్డులో సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు వయసు గలిగిన మహిళ మృతదేహం ఉందని, స్థానికులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 14, 2026

MTM: ప్రభుత్వ కార్యక్రమానికి జనసేన డుమ్మా!

image

మచిలీపట్నంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలు రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు జనసేన నేతలు గైర్హాజరు కాగా, మంత్రి కొల్లు రవీంద్రతో ఉన్న విభేదాల వల్లే వారు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ టాకీస్ సెంటర్‌లో కూడా ఇరు పార్టీల నేతలు వేర్వేరుగానే నివాళులర్పించారు. పొత్తులో ఉన్నప్పటికీ సంస్థాగత విబేధాల కారణంగా నేతలు కలిసి పని చేయకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

News April 14, 2026

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం: కలెక్టర్

image

అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మచిలీపట్నంలోని ఫైర్ స్టేషన్‌లో మంగళవారం ఆయన అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించి, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణకు వాడే వివిధ పరికరాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News April 14, 2026

కృష్ణా: అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎక్కడ?

image

మచిలీపట్నం కోర్టు రోడ్డులోని అంబేడ్కర్ భవన్ శిథిలావస్థకు చేరినప్పటికీ, నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం అడుగు ముందుకు పడటం లేదు. గతంలో రూ.5కోట్ల నిధులతో నిర్మిస్తామని హామీలు ఇచ్చినా, రాజకీయ వైషమ్యాల వల్ల అది సాధ్యపడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా.. అటు MP బాలశౌరి, ఇటు మంత్రి కోళ్లు రవీంద్ర మధ్య సఖ్యత లేకపోవడం వల్లే నిర్మాణం నిలిచిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.