News April 14, 2025

ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలోనే టాప్ గోదూరు

image

జగిత్యాల జిల్లాలో ఎండ దంచికొడుతోంది. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూరులో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో గోదూరు రాష్ట్రంలోనే టాప్ స్థానంలో నిలిచింది. గత వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News January 11, 2026

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ‘దిత్వా’

image

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కనిపిస్తోంది. శనివారం ఉదయం నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడుతుండడంతో.. రైతుల్లో భయందోళన మొదలైంది. జిల్లాలో మిర్చి సుమారు 50వేల ఎకరాలపైగా కాతపూత దశలో ఉంది. మొక్కజొన్న లక్షన్నరపైగా ఎకరాల్లో సాగులో ఉంది. వర్షం పడితే మిర్చి, మొక్కజొన్న రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఉంది. అటు పండుగ సంబురాలకు కూడా వర్షం ఆటంకం కలిగించనుంది.

News January 11, 2026

కృష్ణా: ‘బరి’తెగించిన వసూళ్లు.. ఒక్కో చోట రూ. 20 లక్షల మామూళ్లు!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందేల నిర్వహణకు తెర వెనుక భారీగా మామూళ్ల పర్వం సాగుతోంది. బరుల ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధుల నుంచి పోలీసు అధికారుల వరకు ఒక్కో బరికి సుమారు రూ. 20 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. MLAల అనుచరులే ఈ వ్యవహారాలను చక్కబెడుతున్నారని సమాచారం. భారీగా ముడుపులు చెల్లించడంతో ఈసారి పందేలు ఏ స్థాయిలో జరుగుతాయోనని నిర్వాహకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

News January 11, 2026

ప.గో: ఖద్దరు ఓకే.. ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న ఖాకి!

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో రాజకీయ నేతలు ఇప్పటికే బిరుల(పందెం బరి) నిర్వాహకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తుంటే ఖాకీలు మాత్రం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ అధికారి తాను చేప్పేవరరకు వరకు అమ్యామ్యాలు తీసుకోవద్దు అంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో పందాల నిర్వాహకులు మాత్రం ఆదేశాలు అందాయా.? లేదా.? అని పోలీసులను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.