News September 16, 2024
ఇబ్రహీంపట్నం SIపై ముంబై నటి జెత్వానీ ఫైర్

ముంబైకు చెందిన సినీ నటి జెత్వానీ ఇబ్రహీంపట్నం PSలో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆమె స్టేషన్లో ఉన్న ఓ SIపై ఆగ్రహం వ్యక్తం చేయటం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబై నుంచి తనను బంధువుల వద్ద నుంచి అప్పట్లో ఇబ్రహీంపట్నానికి తీసుకువచ్చింది ఈయనే అంటూ ఆమె SIపై గట్టిగా అరిచింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆమె వైపు చూస్తూ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో ఆయనపై ఉన్నతాధికారులు నిఘాపెట్టారు.
Similar News
News December 1, 2025
కృష్ణా: తీరప్రాంత ప్రజలకు నెరవేరని మంచినీటి కల.!

తరాలు మారినా తమ తలరాతలు మాత్రం మారలేదంటూ సముద్ర తీరం ప్రాంతమైన కృత్తివెన్ను మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చి వెళ్లినా గుక్కెడు మంచినీరు అందించలేకపోయారని, ఇప్పటికీ కుళాయి నీరు అందక మినరల్ వాటర్ ప్లాంట్ నీరే శరణ్యంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు శుద్ధ జల సరఫరా జరుగుతుందనే ఆశతో చూస్తున్నాం అంటున్నారు.
News December 1, 2025
కృష్ణా జిల్లాలో యధావిధిగానే పాఠశాలలు: డీఈఓ

కృష్ణాజిల్లాలో సోమవారం యధావిధిగా పాఠశాలలు కొనసాగుతాయని డీఈఓ రామారావు తెలిపారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు భారీ వర్షాలు పడని కారణంగా పాఠశాలలను యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. భారీ వర్షాలు పడితే కలెక్టర్ ఆదేశాల మేరకు ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తీర ప్రాంత మండలాల్లో అక్కడి పరిస్థితులను బట్టి తహశీల్దార్లు స్కూల్స్ శెలవుపై నిర్ణయం తీసుకుంటారన్నారు.
News November 30, 2025
కృష్ణా జిల్లాలో 1.1మి.మీలు వర్షపాతం నమోదు

దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 1.1 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం ఆదివారం ఉదయం 8.30ని.ల నుంచి రాత్రి 8గంటల వరకు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా నాగాయలంకలో 2.6 మి.మీలు, కోడూరులో 2.2మి.మీలు, అవనిగడ్డ, మోపిదేవిలలో 2.0మి.మీలు, చల్లపల్లి, కంకిపాడులలో 1.8మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది.


