News February 19, 2025
ఇలా చేస్తే మీ ఓటు చెల్లుబాటు కాదు: బాపట్ల కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు అత్యంత జాగ్రత్తగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జి. వెంకట మురళి చెప్పారు. ఓటర్లు ప్రథమ ప్రాధాన్యత ఓటును నమోదు చేయనట్లయితే వారి ఓటు చెల్లుబాటు కాదన్నారు. మంగళవారం ఓటింగ్ విధానంపై ఎన్నికల నిఘావేదిక వారు ప్రచురించిన కరపత్రాలను ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఓటును అంకెలలో కాకుండా అక్షరాలలో నమోదు చేసినా కూడా ఆ ఓటు చెల్లుబాటు కాదన్నారు.
Similar News
News January 10, 2026
అమరావతిపై YCP వైఖరి పూర్తిగా మారినట్లేనా?

AP: అమరావతిపై <<18817916>>సజ్జల<<>> వ్యాఖ్యలతో రాజధానిపై ఆ పార్టీ వైఖరి పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ <<18799615>>కామెంట్ల<<>> తర్వాత YCP అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారనే టాక్ విన్పించింది. 3 రాజధానుల అంశం గత ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు పలుమార్లు ఆ పార్టీ నేతలు అన్నారు. ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అందుకే జగన్ వ్యాఖ్యలపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై మీరేమంటారు.
News January 10, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు..!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
News January 10, 2026
మేడారం జాతరలో 3199మంది వైద్య సిబ్బంది

ఈ సారి మేడారం జాతరలో 3199 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వీరిని నియమించుకుంటారు. మొత్తం 544 మంది వైద్యులలో 72మంది స్పెషలిస్టులు, 42మంది మహిళా డాక్టర్లు ఉంటారు. మరో 2150మంది పారామెడికల్ సిబ్బంది పని చేస్తారు. మేడారంలో 50పడకల ప్రధాన ఆస్పత్రితో పాటు 6 పడకలతో 30క్యాంపులు ఏర్పాటు చేస్తారు.


