News May 11, 2024
ఇల్లంతకుంట మండల విద్యాధికారి సస్పెన్షన్.!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల విద్యాధికారి (FAC ) బన్నాజీని సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడి కే.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఇల్లంతకుంట మండల ఎంపీపీ నుంచి బన్నాజీ సన్మానం పొందారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ RJDకి తెలియజేసారు. ఎన్నికల నియమనిబంధనలు బన్నాజీ ఉల్లంఘించడంతో సస్పెండ్ చేసినట్టు RJD తెలిపారు.
Similar News
News February 8, 2025
సిరిసిల్ల: ట్రాక్టర్లో నాటుబాంబు పెట్టేందుకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మానుక మహిపాల్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్ 29న గ్రామానికి చెందిన గురక ఎల్లయ్య ట్రాక్టర్ సైలెన్సర్లో నాటు బాంబు పెట్టి పేల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. విచారణ జరిపి అతని నుంచి ఒక నాటు బాంబును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ చెప్పారు.
News February 8, 2025
హుజూరాబాద్: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూరాబాద్లోని ఇందిరానగర్లో జరిగింది. పోలీసులా కథనమిలా.. గ్రామానికి చెందిన కోలుగోరి సుజిత్ (30) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అంగీకరించకపోవడంతో పురుగు మందు తాగాడు. ఈ క్రమంలో ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మరణించాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
News February 7, 2025
కరీంనగర్: ఈనెల 17 నుంచి MBA, MCA పరీక్షలు

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని MBA, MCA మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. ఎన్. వి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, MCA థియరీ పరీక్షలు 22న, MBA థియరీ పరీక్షలు 24 న ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.