News April 7, 2025
ఇల్లందకుంట: నేడు రామాలయంలో పట్టాభిషేకం

రెండో అపర భద్రాధిగా పేరుపొందిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నిన్న శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. నేడు ఉదయం 11 గంటలకు ఇల్లందకుంట రామాలయంలో శ్రీరామపట్టాభిషేకం కార్యక్రమం జరుగుతుందని ఆలయ ఛైర్మన్ ఇంగిలి రామారావు, ధర్మకర్తలు మరియు ఆలయ ఈఓ సుధాకర్ తెలిపారు.
Similar News
News December 8, 2025
39పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో 39 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ, CA/ICWAI, డిప్లొమా, బీఎస్సీ(MPC), ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bvfcl.com/
News December 8, 2025
గ్లోబల్ సమ్మిట్లో తెలుగు సినిమా దమ్ము

HYD శివారు మీర్ఖాన్పేట భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్లో మన తెలుగు సినిమాల దమ్మెంటో చూపించటం కోసం ప్రత్యేక ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. న్యూ టెక్నాలజీ, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు, ఇందులో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేక వేదిక కానుంది.
News December 8, 2025
చిన్నవాడైన అల్లుడి కాలును మామ ఎందుకు కడుగుతారు?

పెళ్లి కొడుకును సాక్షాత్తూ నారాయణ స్వరూపంగా భావిస్తారు. పెళ్లి సమయంలో, అల్లుడి పాదాలను కడగడం అనేది తన కూతురిని తీసుకెళ్తున్న దేవుడికి ఇచ్చే గౌరవ మర్యాదగా, సేవగా పరిగణిస్తారు. ఈ ఆచారం ద్వారా, కూతురి తల్లిదండ్రులు తమ అల్లుడి పట్ల తమ భక్తిని, విధేయతను తెలియజేస్తారు. ఇది అల్లుడిని తమ ఇంటికి తీసుకువచ్చిన శుభ సంకేతంగా, దైవానుగ్రహంగా కూడా నమ్ముతారు.


