News April 7, 2025

ఇల్లందకుంట: పట్టు వస్త్రాలు సమర్పించిన బండి సంజయ్

image

ఇల్లందకుంటలోని సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం సందర్భంగా సోమవారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 16, 2025

రామడుగు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రామడుగు మండల కేంద్రంలోని తాటి వనం వద్ద మోచ భూమయ్య మంగళవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 16, 2025

కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర, చిగురుమామిడి, రామడుగు మండలాల్లో 42.2°C నమోదు కాగా, శంకరపట్నం 41.8, గన్నేరువరం 41.7, జమ్మికుంట 41.4, మానకొండూర్ 40.9, కరీంనగర్ రూరల్, చొప్పదండి 40.7, తిమ్మాపూర్ 40.4, వీణవంక 40.3, కరీంనగర్ 40.2, హుజూరాబాద్ 40.0, కొత్తపల్లి 39.9, సైదాపూర్ 39.6, ఇల్లందకుంట 39.1°C గా నమోదైంది.

News April 16, 2025

గల్ఫ్‌లో జగిత్యాల జిల్లా యువకుడి MURDER

image

బతుకుదెరువు కోసం గల్ఫ్‌కి వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం దుబాయ్‌లో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట చెందిన స్వర్గం శ్రీనివాస్ చంద్రయ్య పాకిస్తానీ చేతిలో హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గల్ఫ్ వెళ్లిన శ్రీనివాస్ ఇలా హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!