News March 22, 2025
ఇల్లందు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం: జీఎం కృష్ణయ్య

బొగ్గు ఉత్పత్తిలో 2025 ఆర్థిక సంవత్సరానికి ఇల్లందు ఏరియాకు కేటాయించిన 41.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 11రోజుల ముందుగానే అధిగమించామని ఏరియా జీఎం కృష్ణయ్య తెలిపారు. మార్చి నాటికి ఏరియాకు కేటాయించిన దానికంటే ఎక్కువగా శుక్రవారం 41.35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 100.12% అన్ని ఏరియాలకంటే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి ఇల్లందు ఏరియా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
Similar News
News September 18, 2025
VJA: వెబ్ డెవలపర్ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ

SRR & CVR కళాశాలలో వెబ్ డెవలపర్ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణలో వెబ్సైట్ రూపకల్పనపై శిక్షణ ఇస్తామని, ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు దీనికి హాజరు కావొచ్చన్నారు. వివరాలకై APSSDC ట్రైనింగ్ కో ఆర్డినేషన్ అధికారి నరేశ్ను సంప్రదించాలని కోరారు.
News September 18, 2025
పెద్దపల్లి టాస్క్లో రేపు జాబ్ మేళా

పెద్దపల్లిలోని పాత MPDO కార్యాలయం దగ్గర గల TASK రీజినల్ సెంటర్ లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు TASK ప్రతినిధులు తెలిపారు. టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగం కోసం ఆసక్తి గల నిరుద్యోగులు ఉ. 10గంటల వరకు తమ రెజ్యూమ్ కాపీలు, ఐడీ ప్రూఫ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకొని రావలసి ఉంటుందన్నారు. B.Tech/డిగ్రీ/డిప్లొమా చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 9059506807 సంప్రదించవచ్చు.
News September 18, 2025
VKB: ‘బియ్యాన్ని సమయానికి అందించాలి’

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందించే బియ్యాన్ని సమయానికి అందించాలని రైస్ మిల్లర్లకు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లకు నిర్దేశించిన రైస్ను సకాలంలో అందిస్తే జిల్లాలోని రేషన్ షాపులకు త్వరగా పంపిణీ చేస్తామన్నారు.