News March 29, 2025
ఇల్లందు మండలంలో వ్యక్తి బలవన్మరణం

ఇల్లందు మండలంలో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. సుభాష్ నగర్కి చెందిన మోయిన్ (35) శుక్రవారం రాత్రి ఇంటి పక్కన ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 5, 2025
ములుగు: నేర చరిత్రను దాచిన సర్పంచ్ అభ్యర్థి..!

సర్పంచ్ ఎన్నికలు వివాదాల వైపుకు దారి తీస్తున్నాయి. వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి పంచాయతీలో సర్పంచ్గా పోటీలో ఉన్న ఓ వ్యక్తి తన నేరచరిత్రను దాచి పెట్టి ఎన్నికల కమిషన్ కు తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడని ఆధారాలతో సహా మరో అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరపాలని జిల్లా అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
News December 5, 2025
పాఠశాలలో భోజనం చేసిన అన్నమయ్య కలెక్టర్

కలెక్టర్ నిశాంత్ కుమార్ సిబ్యాలలోని ప్రభుత్వ ఏపీ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లో నిర్వహించిన మెగా PTMలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో పిల్లలతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
News December 5, 2025
కులాల కుంపట్లలో పార్టీలు.. యువతా మేలుకో!

తెలంగాణ పోరులో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలకు పరిమితమైతే శ్రీకాంతాచారి సహా ఎంతో మంది సామాన్యులు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు BC రిజర్వేషన్ల వ్యవహారంలో కులాల కుంపట్లను రాజేసి చలికాచుకునే పనిలో అన్నిపార్టీలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈశ్వరాచారి <<18478689>>ఆత్మహత్యే<<>> ఇందుకు నిదర్శనం. అవకాశవాద నాయకుల ఉచ్చులో పడకుండా యువత సంయమనం పాటించాలి. డిమాండ్ల సాధన కోసం పోరాటాలు చేయండి.. కానీ ప్రాణాలు తీసుకోవద్దు.


