News February 4, 2025
ఇల్లందు: మట్టి పెళ్లలు పడి కార్మికుడు మృతి

ఇల్లందు మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలోని క్వారీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏరియాకు చెందిన పల్లపు ఎల్లయ్య(40) మట్టి పెళ్లలు పడి మరణించాడని స్థానికులు చెప్పారు. పెద్ద సైజు రాళ్లు కొడుతూ కాసేపు సేద తీరుతున్న సమయంలో మట్టి పెళ్లలు పడినట్లు తెలిపారు. గాయపడిన అతడిని తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.
Similar News
News October 31, 2025
గరుడవారధిపై ప్రమాదాలు .. నియంత్రణ ఇలా..!

గరుడ వారధిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అది ప్రమాదాల వారధిగా మారటానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. విశాలమైన రోడ్లలో ఎంత స్పీడ్ వెల్తే అంత మజా అంటూ యువత ప్రాణాలపైకి తెచ్చుకుంటోంది. మలుపు వద్ద వేగ నియంత్రణ కాకపోవడమే ప్రమాదానికి ఒక కారణంగా చెప్పవచ్చు. వేగాన్ని నియంత్రించడంలో మలుపుల వద్ద స్పీడ్ బంప్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయని పలువురు చెబుతున్నారు.
News October 31, 2025
మాజీ సర్పంచ్ రామారావు హత్యపై సీపీ ఆరా

చింతకాని పాతర్లపాడు మాజీ సర్పంచ్, సీపీఎం నేత సామినేని రామారావు హత్య ఘటనపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీపీఎం నేతలు గోపాలరావు, సుదర్శన్ నుంచి ఆయన వివరాలు సేకరించారు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీపీ దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.
News October 31, 2025
సీపీఎం నేత దారుణ హత్య

TG: ఖమ్మం జిల్లా CPM రైతు సంఘం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఉదయం చింతకాని(M) పాతర్లపాడులో వాకింగ్కు వెళ్లిన సమయంలో దుండగులు గొంతుకోసి హత్య చేశారు. ఈయన ఉమ్మడి APలో సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. రామారావు హత్య పట్ల Dy.CM భట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు.


