News February 4, 2025
ఇల్లందు: మట్టి పెళ్లలు పడి కార్మికుడు మృతి

ఇల్లందు మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలోని క్వారీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏరియాకు చెందిన పల్లపు ఎల్లయ్య(40) మట్టి పెళ్లలు పడి మరణించాడని స్థానికులు చెప్పారు. పెద్ద సైజు రాళ్లు కొడుతూ కాసేపు సేద తీరుతున్న సమయంలో మట్టి పెళ్లలు పడినట్లు తెలిపారు. గాయపడిన అతడిని తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.
Similar News
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 1, 2025
అధ్యక్షా.. కడప – బెంగుళూరు రైలు రోడ్డు కథ కంచికేనా..?

మదనపల్లి జిల్లా కల నెరవేరింది. కడప- బెంగళూరు రైలు రోడ్డు వేస్తామని మరిచారు. అయితే ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన గళం వినిపించి కడప మదనపల్లి మీదుగా బెంగుళూరుకి రైల్వే రోడ్డుకు కృషి చేస్తారా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాజంపేట పరిధిలో బస్ షెల్టర్ల ఏర్పాటుపై చర్చించి, గతంలో మంజూరైన రైల్వే రోడ్డు, బస్ షెల్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తారా? చూడాలి.
News December 1, 2025
NGKL జిల్లాలో తగ్గిన చలి

నాగర్కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో 18.1°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 18.3°C, తోటపల్లిలో 18.5°C, ఊర్కొండ, వెల్దండలలో 18.6°C, తాడూరులో 18.7°C, చారకొండ మండలంలో 18.8°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


